Tag Archives: government schemes

భార్య పేరుపై ఇంటిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు మీ కోసమే..

ఇంటిని కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని సొంత స్థలం ఉంటే దగ్గరుండి నిర్మిస్థారు. లేదంటే కట్టిన ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మహిళల పేరు మీదనే చేసేందుకు చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే, మహిళల పేరుతో ఇల్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

వీటి ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు చాలావరకు ఉంటాయి. ఇన్ కమ్ ట్యాక్స్ లో మహిళలకు ఎక్కువ పన్ను రాయితీలు ఇస్తుంటారు. ఈ విషయం తెలిసిన చాలామంది మహిళల పేరు మీదనే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇంకా ఇంటి రుణం తీసుకునే క్రమంలో కూడా మహిళా కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలపై 0.5 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది.

అంతే కాకుండా స్టాంప్ డ్యూటీలో కూడా మినహాయింపులను మహిళలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర స్థాయిలో విస్తృత రాయితీలను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గృహ రుణాలు తీసుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం వడ్డీ తగ్గించింది. అయితే, ఎస్‌బిఐ యోనో యాప్ ద్వారా హౌస్ లోన్ అప్లై చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.

ఇక ఎస్బీఐ హోమ్ లోన్ విషయానికి వస్తే వడ్డీ రేటు 6.70 శాతం గా ఉంది. రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉండే గృహ రుణాలపై వడ్డీ రేటును 6.95 శాతంగా ఉంది. రూ. 75 లక్షలుపైన రుణం తీసుకున్న వాళ్లకు ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటును ఇస్తున్నారు.

ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నిమ్మగడ్డ ఆదేశాలతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ నేడు అమ్మఒడి పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ఈ పథకంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి వీలు లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఖాతాల్లో జమ కావాల్సిన అమ్మఒడి నగదు ఆలస్యంగా జమ కానుంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా నిలిచిపోనుంది. జగన్ సర్కార్ గత నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది.

ఎన్నికల సంఘం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతూ పథకాల అమలుకు బ్రేక్ వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టులో జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ గురించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.