Featured

ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నిమ్మగడ్డ ఆదేశాలతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ నేడు అమ్మఒడి పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ఈ పథకంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి వీలు లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఖాతాల్లో జమ కావాల్సిన అమ్మఒడి నగదు ఆలస్యంగా జమ కానుంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా నిలిచిపోనుంది. జగన్ సర్కార్ గత నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది.

ఎన్నికల సంఘం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతూ పథకాల అమలుకు బ్రేక్ వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టులో జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ గురించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

1 hour ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

1 hour ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

2 hours ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

5 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

5 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

5 hours ago