మన రక్తం ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అనే విషయం అందరికీ తెలిసింది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అందుకు గల కారణం సరైన పోషకాహార లోపం అని చెప్పవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే నీరసించిపోవడం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగాలంటే ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా పురుషులలో హిమోగ్లోబిన్ స్థాయి 14 నుంచి 16 వరకు, మహిళలలో 12 నుంచి 14 శాతం ఉంటే ఆరోగ్యవంతులుగా పరిగణిస్తారు. అంతకన్నా తక్కువ శాతం హిమోగ్లోబిన్ మన రక్తంలో ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా పురుషులలో కన్నా మహిళల్లో తలెత్తుతుంది. తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరగకపోతే వడం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రక్తం ఎక్కువగా పోవడం వంటి వాటి ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఎక్కువ శాతం విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న గుడ్లు మాంసం వంటి పదార్థాలను తరచూ తీసుకోవాలి. అంతేకాకుండా ఐరన్ క్యాప్సిల్స్ వేసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందని చెప్పవచ్చు.
దానిమ్మ, ఆపిల్, జామ వంటి తాజా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఐరన్ పుష్కలంగా లభించే సీఫుడ్ తరచూ తీసుకోవాలి. అదేవిధంగా చిక్కుడు కాయ గింజలు, వేరుశెనగ, సోయా బీన్స్ వంటి ఐరన్ పుష్కలంగా ఉండే కూరగాయలను తీసుకోవడం ద్వారా రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ శాంతం పెరుగుతుంది. అంతేకాకుండా వేరుశెనగ గింజలు బెల్లం పాకం ద్వారా తయారు చేసుకున్న చిక్కి తీసుకోవటం ద్వారా మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు.ఈ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…