Featured

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఈ ఆహారం తప్పనిసరి!

మన రక్తం ఎర్రగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అనే విషయం అందరికీ తెలిసింది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అందుకు గల కారణం సరైన పోషకాహార లోపం అని చెప్పవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే నీరసించిపోవడం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగాలంటే ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా పురుషులలో హిమోగ్లోబిన్ స్థాయి 14 నుంచి 16 వరకు, మహిళలలో 12 నుంచి 14 శాతం ఉంటే ఆరోగ్యవంతులుగా పరిగణిస్తారు. అంతకన్నా తక్కువ శాతం హిమోగ్లోబిన్ మన రక్తంలో ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా పురుషులలో కన్నా మహిళల్లో తలెత్తుతుంది. తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరగకపోతే వడం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రక్తం ఎక్కువగా పోవడం వంటి వాటి ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఎక్కువ శాతం విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న గుడ్లు మాంసం వంటి పదార్థాలను తరచూ తీసుకోవాలి. అంతేకాకుండా ఐరన్ క్యాప్సిల్స్ వేసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందని చెప్పవచ్చు.

దానిమ్మ, ఆపిల్, జామ వంటి తాజా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఐరన్ పుష్కలంగా లభించే సీఫుడ్ తరచూ తీసుకోవాలి. అదేవిధంగా చిక్కుడు కాయ గింజలు, వేరుశెనగ, సోయా బీన్స్ వంటి ఐరన్ పుష్కలంగా ఉండే కూరగాయలను తీసుకోవడం ద్వారా రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ శాంతం పెరుగుతుంది. అంతేకాకుండా వేరుశెనగ గింజలు బెల్లం పాకం ద్వారా తయారు చేసుకున్న చిక్కి తీసుకోవటం ద్వారా మన శరీరానికి ఐరన్ పుష్కలంగా లభిస్తుందని చెప్పవచ్చు.ఈ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago