వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల చాలామంది శరీరంలో కూడా పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరికి చలికాలంలో కూడా శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం ద్వారా శరీరం పై పొక్కులు ఏర్పడటం, నోట్లో పుండ్లు ఏర్పడటం, చెమట కాయలు, ముక్కు ద్వారా రక్తం కారడం,తరచూ వళ్ళు వేడి అవుతూ జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే శరీరంలో అధిక వేడి వల్ల సతమతమయ్యేవారు వారి ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో వేడిని కొంత వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు నీటి శాతం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో పెరుగన్నం తప్పకుండా తీసుకోవాలి. వీలైతే ఒక గ్లాసు పలుచటి మజ్జిగను తాగడం ద్వారా శరీర వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే నీటిశాతం అధికంగా ఉన్న పుచ్చకాయ, కీర దోసకాయ, దానిమ్మ వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ఈ సమస్య తగ్గాలంటే నీటిలో మెంతుల పొడి వేసుకుని తాగటం ద్వారా మన శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో ఈ వేడి ఉండటంవల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు చల్లటి గాలి తగిలే ప్రదేశాలలో ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ పద్ధతులన్నీ పాటించినప్పటికీ కూడా వారిలో ఏ మాత్రం మార్పు రాకపోతే వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…