వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల చాలామంది శరీరంలో కూడా పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరికి చలికాలంలో కూడా శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం ద్వారా శరీరం పై పొక్కులు ఏర్పడటం, నోట్లో పుండ్లు ఏర్పడటం, చెమట కాయలు, ముక్కు ద్వారా రక్తం కారడం,తరచూ వళ్ళు వేడి అవుతూ జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే శరీరంలో అధిక వేడి వల్ల సతమతమయ్యేవారు వారి ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో వేడిని కొంత వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు నీటి శాతం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో పెరుగన్నం తప్పకుండా తీసుకోవాలి. వీలైతే ఒక గ్లాసు పలుచటి మజ్జిగను తాగడం ద్వారా శరీర వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే నీటిశాతం అధికంగా ఉన్న పుచ్చకాయ, కీర దోసకాయ, దానిమ్మ వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
ఈ సమస్య తగ్గాలంటే నీటిలో మెంతుల పొడి వేసుకుని తాగటం ద్వారా మన శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో ఈ వేడి ఉండటంవల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు చల్లటి గాలి తగిలే ప్రదేశాలలో ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ పద్ధతులన్నీ పాటించినప్పటికీ కూడా వారిలో ఏ మాత్రం మార్పు రాకపోతే వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…