ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల రీత్యా ఆఫీసులకు వెళ్లటం వల్ల ఇంట్లో వంటలు చేయడం కుదరక తొందరగా ఫాస్ట్ ఫుడ్ తయారుచేసి పెట్టడం వల్ల పిల్లలు ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. అందువల్ల చిన్న పిల్లలు ఎక్కువగా పోషకాహారం తినడానికి పెద్దగా ఇష్టం చూపించడం లేదు. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల వారిలో పోషకాహారలోపం ఏర్పడుతుంది. ఈ పోషకాహార లోపం వల్ల పిల్లల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.
పిల్లలలో శారీరక ఎదుగుదల ఆగిపోవడంతో పాటు, ఎటువంటి పనులను చేయడానికి కూడా ఆసక్తిని కనబరచరు. పిల్లలను పోషకాహార లోపం నుంచి కాపాడాలి అంటే వారికి సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని సరైన సమయంలో తినిపించడం ద్వారా శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. పిల్లలలో శారీరక ఎదుగుదల ఉండాలంటే ఏ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినిపించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చిన్నపిల్లల ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే వారికి రోజంతా ఎంతో నీరసంగా అలసిపోయి ఉండటంవల్ల ఎలాంటి పనులను చేయడానికి ఆసక్తి చూపించరు. అందుకోసమే ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోసే, ఉప్మా వంటి వాటిని తినిపించాలి. అలాగే స్కూల్ కి వెళ్ళే పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలో ఒక గ్లాసు పాలు తాగడం వల్ల రోజంతా ఎంతో చురుగ్గా ఉంటారు. అలాగే మధ్యాహ్న సమయంలో అన్నంతో పాటు తాజా కూరగాయలు పప్పు దినుసుల తో చేసిన కూరలతో కలిపి అన్నం తినిపించాలి.
సాయంత్రం ఒక గ్లాసు పాలను తాపించాలి. ఒకవేళ పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు రాగి మాల్ట్ చేసి తాగించవచ్చు. అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ గా శనగపప్పు గుగ్గిళ్ళు, మరమరాలు, ఉడికించిన వేరుశనగ గింజలు మొదలైన వాటిని తినిపించాలి. అదేవిధంగా రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం తినిపించాలి. రాత్రి భోజనంలో అన్నంతో పాటు కూరలను లేదా చపాతి వంటి వాటిని తినిపించాలి. అదేవిధంగా పడుకునే ముందు ఏదైనా ఒక పండును కచ్చితంగా తినేలా చూసుకోవాలి ఈ విధమైన ఆహారపు అలవాట్లను చేయడం ద్వారా పిల్లలలో శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. పిల్లలను వీలైనంతవరకు చిరుతిళ్ళకు అలవాటు చేయడం మానేయాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…