Tag Archives: haryana

హర్యానాలో బ్లాక్ ఫంగస్ విలయ తాండవం.. ఒక్కరోజులోనే 18 మంది మృతి!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కేసులు పెరుగుదల కొంతమేర తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ విలయతాండవం చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న మని ఆనందం కూడా లేకుండా బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దేశంలోనే అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా తరువాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటలలో హర్యానాలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, ఏకంగా ఈ ఫంగస్ బారిన పడి 18 మంది మృతి చెందారు. హర్యానాలో కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఇంజక్షన్ లతోపాటు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా కొరత ఏర్పడటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయగా కేవలం ఐదు శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలిపారు.బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్సలో వాడే యాంటీ-ఫంగల్ ఔషధం ‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’ హరియాణాలో తగినంత అందుబాటులో లేకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ గుర్తించిన వెంటనే యాంటీ ఫంగల్ ఔషధం
‘అంపోటెరిసిన్‌ బి లిపోజమ్‌’రోజుకు నాలుగు సార్లు ఇవ్వడం ద్వారా ఈ ఫంగస్ నుంచి తొందరగా కోలుకో వచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే తీవ్రమైన మందుల కొరత ఏర్పడటంతో ఔషధాన్ని కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే బాధితులకు అందివ్వాలని హర్యానా నిపుణుల కమిటీ గత రెండు రోజుల క్రితం సూచించింది. అయితే ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 25వ తేదీ వరకు హర్యానా రాష్ట్రానికి 1,110 అంపోటెరిసిన్-బి అందజేశామని కేంద్రం తెలిపింది.

ఆ ఇంటి ముందు వాకిలి పంజాబ్ లో ఉంటే..వెనుక వాకిలి హర్యానాలో !

సాధారణంగా కొన్ని కొన్ని విషయాలను గురించి వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలు చెప్పిన ఎవరు నమ్మరు.ఈ విధంగా ఆశ్చర్యకరమైన విషయాలను ఆధారాలతో సహా చూపిస్తే తప్ప నమ్మని పరిస్థితులు తలెత్తుతాయి. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక దేశమైనా, రాష్ట్రమైనా, ఒక ఇంటికైనా సరిహద్దు అనేది తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా సరిహద్దుల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు తలెత్తడం గురించి మనం వినే ఉంటాం. అయితే సరిహద్దు కారణంగా ఓ ఇల్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జగవంతి దేవి అనే 70 సంవత్సరాల మహిళ కొంతకాలం క్రితం తన ఇంటిని విస్తరించింది. అయితే తన ఇల్లు సగం పంజాబ్ రాష్ట్రంలో ఉండగా, సగం హర్యానాలోకి వెళ్ళింది. మూడు నెలల క్రితం ఆమె ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె భూమి ఉర్దూలో రిజిస్ట్రీ ఉండగా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో చేసేదేమీ లేక భూమి రిజిస్ట్రేషన్ పంజాబీలోకి మార్పించారు. ఆ విధంగా మార్చిన ఆమెకు పని జరగకపోవడంతో ఆ భూమి రిజిస్ట్రీ ఆంగ్లంలోకి మార్పించారు. ఇక తమ ఇంటి విద్యుత్ కనెక్షన్ కోసం ఎలాంటి అభ్యంతరాలు ఉండవని భావించారు.

విద్యుత్ శాఖ అధికారులు జగవంతి దేవి ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి మరోసారి అభ్యంతరం తెలిపారు.తన ఇల్లు రెండు రాష్ట్రాలలో ఉండటం వల్ల ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని, ఆ ఇంటికి సరిహద్దు గోడ నిర్మించే వరకు కనెక్షన్ ఇవ్వడం కుదరదని అధికారులు తెలియజేయడంతో జగవంతి దేవి చేసేదేమీలేక ఆ ఇంటికి మధ్యలో ఓ అడ్డుగోడను నిర్మించింది.

పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇలాంటి సరిహద్దు వివాదాలు ఎన్నో తలెత్తాయి. ప్రస్తుతం ఇలాంటి వివాదంలోనే ఆ ఇల్లు కూడా ఇరుక్కుపోయింది. ఈ విధంగా ఇంటికి మధ్యలో అడ్డుగోడ నిర్మించడంతో గోడ కిటికీలో నుంచి ఒకవైపు అత్తగారు మరోవైపు కోడలు ఉండి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.