Tag Archives: Husband Kills Wife

దారుణం: భార్యను చంపి గడ్డిలో చుట్టి పరారైన భర్త… చివరికి ఏం జరిగిందంటే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్నో అనురాగాలు, ఆప్యాయతలు, కొట్లాటలు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే ఇవి కేవలం కొద్ది సమయం వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత యధావిధిగా భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తే అవి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. లేదా హత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి హత్య హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

చత్తీస్‌ఘడ్‌కు చెందిన అటల్‌ పార్థి, రేఖా పార్థి బతుకుతెరువు కోసం హైదరాబాద్ చేరుకొని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5లోని దుర్గా భవానీనగర్‌ను ఆనుకొని ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఓ బిల్డర్‌ వద్ద వాచ్ మెన్ గతేడాది కాలంగా పని చేస్తున్నారు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తుతూ ఉండేవి. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ కొంత సమయానికి తిరిగి సద్దుమణిగేవి.

ఈ విధంగానే గత రెండు రోజుల క్రితం ఈ భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో ఎంతో ఆవేశం చెందిన అటల్‌ పార్థి, తన భార్య రేఖా పార్థి పై గొడవకు దిగుతూ ఆమెను హత్య చేశాడు. ఇలా తన భార్యను హత్య చేసి తన శవాన్ని తాను వాచ్మెన్ గా పని చేస్తున్నటువంటి ఫ్లాట్ కాంపౌండ్ గోడ పక్కనే వరిగడ్డిలో చుట్టి అక్కడే పడేసి పరారయ్యాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి తమ బంధువులకు సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

దారుణ హత్యకు గురైన మహిళా కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..!

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులోని విరుదునగర్‌లో చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది.

భార్యభర్తల మధ్య విబేధాల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణించిన కానిస్టేబుల్ భానుప్రియగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరుదునగర్‌ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో భానుప్రియ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఐదు సంవత్సరాల క్రితం విష్నేష్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

ప్రస్తుతం వీరి కుటుంబం కులకరై ప్రాంతంలో నివసిస్తోంది. అయితే ఇటీవల దంపతుల మధ్య చిన్న సమస్యల కారణంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విష్నేష్ తన నివాసాన్ని మధురైకి మార్చాలని అనుకున్నాడు. కానీ అతడి భార్య దానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇలా ఏదో ఒక సమస్య కారణంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఓ రోజు తీవ్ర ఆవేదనకు గురైన విష్నేష్ ఆమె గొంతును బెల్ట్ తో బిగించి హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి.. వివరాలను సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. భానుప్రియ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వరకట్నం కోసం వేధించాడా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.