క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులోని విరుదునగర్లో చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది.
భార్యభర్తల మధ్య విబేధాల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణించిన కానిస్టేబుల్ భానుప్రియగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరుదునగర్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఐదు సంవత్సరాల క్రితం విష్నేష్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
ప్రస్తుతం వీరి కుటుంబం కులకరై ప్రాంతంలో నివసిస్తోంది. అయితే ఇటీవల దంపతుల మధ్య చిన్న సమస్యల కారణంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విష్నేష్ తన నివాసాన్ని మధురైకి మార్చాలని అనుకున్నాడు. కానీ అతడి భార్య దానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇలా ఏదో ఒక సమస్య కారణంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఓ రోజు తీవ్ర ఆవేదనకు గురైన విష్నేష్ ఆమె గొంతును బెల్ట్ తో బిగించి హత్య చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి.. వివరాలను సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. భానుప్రియ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వరకట్నం కోసం వేధించాడా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…