Tag Archives: kathi mahesh

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్.. లహరి షెరి.. గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

చెప్పిన సమయానికే.. చెప్పిన తేదీకే బిగ్ బాస్ 5 సీజన్ మొదలైంది. అదరి అంచనాలను అందుకుంటూ.. విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. అందులో చాలామంది ఎంతో కొంతో దేనిలో ఒక దానిలో ప్రావీణ్యం ఉన్నవాళ్లను తీసుకున్నారు నిర్వాహకులు.

కొందరు అందరికీ సుపరిచతం కాకపోయినా.. మరికొంత మంది తెలిసినవారు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ హౌస్ లో మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లహరి షెరి. అయితే ఆమె గురించి పెద్దగా తెలియదు. కానీ పలు సినిమాల్లో ఆమె చిన్న చిన్న పాత్రల్లో నటించారు. విజయ్ దేవరకొండలో నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాలో ఆమె ఓ నర్సు క్యారెక్టర్ చేసింది.

చిన్న పాత్ర అయినా ఎంతో ఒదిగిపోయి నటించింది లహరి. ఆమె పూర్తి పేరు శరణ్య లహరి శర్మ. పుట్టింది.. పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే సెలెబ్రేషన్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఆమె కెరీర్ ను మొదలు పెట్టారు. ఒక నటిగా, యాంకర్ గా.. ఇటు మహాన్యూస్ లో డిబేట్ వంటి వాటికి హోస్ట్ గా కూడా చేశారు లహరి. దివంగత కత్తి మహేశ్ తో చేసిన డిబేట్ లో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది.

పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ అంతా ఆమెకు ఎంతో సపోర్టుగా నిలిచారు. ఇప్పటికే పలు సనిమాల్లో నటించిన లహరి.. ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమా‘గని’లో కూడా ఆమె నటించింది. ఇలా ఆమె నటనలో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది. అంతే కాదు ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు.

అలా ఉండకపోతే తల తీసేస్తారని కత్తి మహేష్ అనే వాడు.. కమెడియన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు పృథ్వి రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న పృథ్వి ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పృథ్వి రాజ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా పృథ్వి రాజా నటుడు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పృథ్వి రాజ్ మాట్లాడుతూ కత్తి మహేష్ మరణించినప్పటికీ అతని గురించి చేసే పలు వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉంటాయని పృద్వి తెలిపారు. కత్తి మహేష్,కమెడియన్ పృథ్వి గత ఎన్నికలలో భాగంగా వైసీపీ తరఫున పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి పృధ్విరాజ్ తెలియజేశారు. ఈ క్రమంలోనే పృథ్వి రాజ్ తనని కత్తి మహేష్ అన్నా అని పిలిచే వాడని, ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఎంతో సహాయం చేశాడని తెలిపారు.

ఈ క్రమంలోనే ఇద్దరం క్యాజువల్ గా మాట్లాడుతున్న సమయంలో ఎందుకు అంత వివాదాలకు కారణమవుతూ దారుణంగా ఎందుకు ట్రోలింగ్ అవుతున్నావని కత్తి మహేష్ ను అడిగినప్పుడు అందుకు సమాధానంగా అన్నా.. మనం యుద్ధం చేస్తున్నాము. సైలెంట్ గా ఒక చెట్టు కింద కూర్చుంటే అవతలి వారు మన తల తీసేస్తారు. అందుకే ఎప్పుడూ సైలెంట్ గా ఉండకూడదు అని చెప్పేవారు.

నిజానికి కత్తి మహేష్ ఎంతో మంచి మనస్తత్వం కలవాడు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ ఆయన మరణంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రైవర్ కి ఏమీ కాకుండా కేవలం మహేష్ కు మాత్రమే అలా జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏది ఏమైనా చనిపోయిన ఒక వ్యక్తి గురించి ఎంతో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అది ఎంతో బాధాకరం..అంటూ కమెడియన్ పృథ్విరాజ్ కత్తి మహేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కళ్ళు లేకపోవడం కంటే చనిపోవడం మంచిది.. కత్తి మహేష్ మరణంపై ..నటుడు సమీర్ కామెంట్స్!

ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్, నటుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల ఆయనతో సన్నిహితంగా ఉన్న నటులు స్పందించి ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. కత్తి మహేష్ తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే వాడు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఎంతో మంది శత్రువులు పెరిగారు.కత్తి మహేష్ మరణం కొన్ని వర్గాల వారికి తీరని లోటు అయితే మరి కొందరు అతని మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కత్తి మహేష్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పరిచయమైన నటుడు సమీర్ కత్తి మహేష్ మరణం పై స్పందించి ఎంతో బావోద్వేగం అయ్యారు. కత్తి మహేష్ తనకు బిగ్ బాస్ హౌస్ లోనే పరిచయం అయ్యారని, అందరూ అనుకుంటున్నట్టుగా తెరపై కనిపించే కత్తి మహేష్ వేరు తెర బయట కత్తి మహేష్ వేరు అతను ఎంతో మంచి వాడు అంటూ సమీర్ తెలిపారు.

బిగ్ బాస్ ద్వారా తనతో ఎంతో అనుబంధం ఏర్పడింది. మహేష్ ఈ విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే ఎంతో షాక్ అయ్యానని,అయితే ఈ ప్రమాదంలో తనకు ఏమి ప్రమాదం లేదు ఒక కన్ను మాత్రమే తొలగించారని తెలియడంతో తను క్షేమంగా బయటపడతారని భావించాను. కానీ తర్వాత మరో కన్ను కూడా తొలగించాలని చెప్పారు. కానీ అతని మరణాన్ని ఊహించలేదని సమీర్ భావోద్వేగ మయ్యారు.

ఒక్కసారి మహేష్ తో మాట్లాడితే అతని మనస్తత్వం ఏమిటో తెలిసిపోతుంది. అతను టీవీలో కనిపించే విధంగా బయట ఉండరు. కత్తి మహేష్ చాలా లవ్లీ & నైస్ పర్సన్. చాలాసార్లు మా మధ్య డిస్కషన్ జరిగేది. ఎందుకు ఇలా కాంట్రవర్శిలలో ఉండటం అని అడిగేవాడిని. అందుకు మహేష్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి భయం ఎందుకు అనేవాడు. ఏది ఏమైనా కత్తి మహేష్ మరణం తీరనిలోటు. కళ్ళు తీసేసి ప్రపంచం మొత్తం చీకటి అవ్వడం కంటే చనిపోవడమే మంచిది దేవుడు ఈ విధంగా తనకు మంచి చేశాడని, అతని కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సమీర్ పంచుకున్నారు.

కత్తి మహేష్ మరణం వెనుక ఇంత కథ ఉందా… మహేష్ చనిపోయాడా లేక చంపేశారా?

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపించే పేర్లలో కత్తి మహేష్ పేరు ఒకటి. ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడిగా రాజకీయ విమర్శకుడిగా నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో ఉండే కత్తి మహేష్ మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. కత్తి మహేష్ జూన్ 26న నెల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.

కత్తి మహేష్ వైద్యానికి సహకరిస్తున్నారని, అతడు ఆరోగ్యంగా ఉన్నాడని తొందరలోనే డిశ్చార్జ్ చేస్తున్నారని హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో కత్తి మహేష్ అభిమానులు సంబర పడ్డారు.ఈ క్రమంలోనే ఉన్నఫలంగా అతని ఆరోగ్యం క్షీణించిందని చెప్పిన కొన్ని క్షణాలకే కత్తి మహేష్ మరణించారని జూలై 10న వైద్యులు ప్రకటించారు. దీంతో కత్తి మహేష్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

కత్తి మహేష్ కోలుకున్నాడని చెప్పిన వైద్యులు అతనికి ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించడంతో ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కత్తి మహేష్ మేనమామ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తొలగించిన తర్వాత ఏం జరిగిందో వివరించాలని అభిమానులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈయనకు అన్ని సర్జరీలు సక్సెస్ అయ్యాయి.కొద్ది రోజులలో డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు అతను మరణించారని ధ్రువీకరించడంతో మహేష్ చావు వెనక ఏదో రహస్యం దాగి ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేయగా అతడు అనారోగ్యం కారణంగానే మృతిచెందాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మహేష్ అంత్యక్రియలకు హాజరైన మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ మహేష్ వెనుక పలు అనుమానాలు ఉన్నాయని… దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఏది ఏమైనా కత్తి మహేష్ చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా హెడ్ లైన్స్‌లో ఉంటున్నాడు. కత్తి మహేష్ రావు వెనుక మిస్టరీ ఉందా లేదా అనే విషయం తెలియాలంటే వైద్యులు అసలు విషయం బయట పెట్టాల్సి ఉంటుంది.

శేఖర్ కమ్ములకు వార్నింగ్ ఇస్తున్న నెటిజన్స్.. అంతా కత్తి మహేష్ వల్లే..!

తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్ మరణం ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొన్ని రోజుల కిందట తాను ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టడంతో కత్తి మహేష్ కు ప్రమాదం జరిగింది. దీంతో స్వల్ప గాయాలతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత చెన్నైలోని హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యం జరుగుతుండగా శనివారం సాయంత్రం తన ప్రాణాలను వదిలాడు. ఇక సినీ రంగానికి చెందిన వాళ్లు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ కమ్ముల కూడా ఆయన మరణం పట్ల ఓ పోస్ట్ చేయగా.. నెటిజన్లు తెగ మండిపడుతున్నారు.

నిజానికి కత్తి మహేష్ ఇండస్ట్రీకి చెందిన నటులను బాగా విమర్శలు చేస్తూ ఉంటాడు. పవన్ పట్ల తెగ విరుచుకుపడుతుంటాడు. సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో సంచలనం రేపుతుంటాడు. ఇక ఈయన పై నెటిజన్లు కూడా తెగ మండిపడుతుంటారు. గతంలో శ్రీ రాముడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, సీతాదేవిపై చేసిన విమర్శల పట్ల ఆయనపై తెగ మండిపడ్డారు ప్రజలు. ఆయన మరణించాక కూడా ఇంకా విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.

తెలుగు సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ మరణం గురించి సంతాపం తెలిపాడు. కత్తి మహేష్ మరణం తీరని లోటని, ఆ లోటును పూడ్చడం చాలా కష్టమని అన్నాడు. అంతే కాకుండా ఆయన శాస్త్రీయ దృక్పథం ఉన్నా నిజమైన పోరాటయోధుడు అని అనడంతో ఈ వ్యాఖ్యలను చూసిన నెటిజన్లు శేఖర్ కమ్ముల పై తెగ విరుచుకుపడుతున్నారు. గతంలో శ్రీరాముడు పై చేసిన వ్యాఖ్యలు గురించి అతనిని ద్వేషించకుండా అతని మరణం పై మీ దగ్గర నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేమంటున్నారు.

శ్రీ రాముల వారిని దూషించినప్పుడు ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ‘సినీ ఇండస్ట్రీలో కొందరు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా వారి గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. అలాగే మీరు కూడా అలాంటి లిస్ట్ నుండి వెళ్లకుండా చూసుకోండి’ అనే తెలుపుతున్నారు. అంతే కాకుండా నిన్న జస్వంత్ రెడ్డి అనే ఒక జవాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతను కదా నిజమైన ఫైటర్.. అలాంటి మహానుభావులను వదిలి శ్రీరామునిపై దూషించిన కత్తి మహేష్ ఎలా ట్రూ ఫైటర్ అవుతాడని.. శేఖర్ కమ్ముల పై బాగా మండిపడుతున్నారు.