Tag Archives: Life Insurance Corporation

ఎల్ఐసీ పాలసీదారుడు చనిపోతే… డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఎదో ఒక పాలసీ చాలామందికి ఉండే ఉంటుంది. అయితే పాలసీదారుడు మధ్యలో మృతి చెందినట్లయితే ఆ ఇన్సురెన్స్ డబ్బులను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు. నామినీ మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవాలా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసుకోవచ్చా అనేది తెలియదు. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది.

ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే ఆ మొత్తం పాలసీ డబ్బులను నామినీ మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ క్లెయిమ్‌ను కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాడానికి ఎల్‌ఐసీ కల్పించింది. ముందుగా ఏజెంట్ ని సంప్రదించి సంతకం తీసుకొని హోమ్‌ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని బ్రాంచ్‌ అధికారులకు తెలిపి.. ఫామ్‌ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌ల‌ను నిపాల్సి వస్తుంది.

తర్వాత చనిపోయిన పాలసీదారుడి డెత్ సర్టిఫికెట్ మరియు అతడి ఒరిజినల్ ఎల్ఐసీ బాండ్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వాటిపై సంతకం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా నామినీకి సంబంధించి పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డుపై సంతకం చేసి అధికారుల ఇవ్వాల్సి ఉంటుంది. ఓ లెటర్ లో చనిపోయిన పాలసీదారుడి ఇంటి అడ్రస్ తో మరికొన్నివివరాలను నింపి హోమ్ బ్రాంచ్ అధికారులకు సమర్పించాలి.

తర్వాత నామినీ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. దీనిలో ముఖ్యంగా హోమ్ బ్రంచ్ కు వెళ్లే సమయంలో డాక్యుమెంట్స్ సమర్పణలో ఒరిజినల్ ఐడీ కార్డులను వెంట తెచ్చుకోవాలి. చివరకు బ్యాంక్ ఒరిజిన‌ల్ పాస్ బుక్‌ను కూడా అధికారులు చెక్ చేశాక‌ అధికారులు డెత్ క్లెయిమ్‌కు సంబంధించిన అప్లికేష‌న్‌ను ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేస్తారు. ఇలా నామినీ డెత్ క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కు షాక్.. రూ.15.5 లక్షలు పరిహారం చెల్లించాలంటూ ఆదేశం..?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)కు జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. ఓ బాధితుడి బీమా క్లెయిమ్‌ విషయంలో సరిగ్గా సమాధానం చేప్పకపోవడం.. సదరు వ్యక్తి బీమాను తిరస్కరించినందుకు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం ఎల్ ఐసీని రూ.15.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి 2012లో జీవన్‌ ఆనంద్‌ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్‌ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని తీసుకున్నాడు. అయితే అతడు కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చినిపోయిన సదరు వ్యక్తి తండ్రి పేరు రాములు. బీమా క్లెయిమ్ కోసం రాములు తన మైనర్‌ మనవరాళ్ల తరపున జూలై 6, 2012న ఎల్‌ఐసీకి క్లెయిమ్‌ను సమర్పించాడు. అయితే చనిపోయిన సదరు వ్యక్తి తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారం వెల్లడించలేదని.. మునుపటి పాలసీల గురించి కూడా తమకు తెలపలేదని బీమా క్లెయిమ్‌ను ఎల్ ఐసీ తిరస్కరించింది.

దీనిపై వాళ్లు హైదరాబాద్ వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించారు. మరణించిన వ్యక్తి పాలసీలో కేవలం ఒక విషయం గురించి మాత్రమే ప్రకటించలేదని బెంచ్‌ తెలిపింది. జూన్‌ 13,2012 నాటి డిశ్చార్జ్‌ సారాంశం ప్రకారం.. బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27,2011న తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేస్తున్నట్లు రికార్డులో ఏమి లేదు అని బెంచ్‌ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25వ తేదీన వెల్లడించింది.

క్లెయిమ్‌ను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి 15.5 లక్షల రూపాలయలను చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఎల్‌ఐసీని ఆదేశించింది. అంతేకాకుండా 9 శాతం వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. అలాగే వాటితో పాటు ఫిర్యాదుదారుడు కోర్టు ఖర్చుల కింద కూడా మరో రూ. 5000 చెల్లించాలని ఆదేశించింది.