Tag Archives: love propose

sobha shetty: అమ్మాయిల ఫాలోయింగ్ లేదని తెలిసి ప్రేమించాను… శోభ తెలివితేటలు మామూలుగా లేవుగా?

sobha shetty: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బిగ్ బాస్ కార్యక్రమాలు కంటే ముందుగానే ఈమె కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించే ప్రేక్షకులను మెప్పించారు.ఈ సీరియల్ లో మోనిత పాత్రలో నటించినటువంటి శోభా శెట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె పెద్దగా బుల్లితెర సీరియల్స్ సందడి చేయలేదు అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 14 వారాలపాటు కొనసాగినటువంటి ఈమె బయటకు వచ్చిన తర్వాత మొదట సారి స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేశారు. ఇందులో భాగంగా తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అందరి సమక్షంలోనే యశ్వంత్ రెడ్డి తనకు ప్రపోజ్ చేస్తూ ఆమె చేతికి ఉంగరం తొడిగారు.

ఇకపోతే శ్రీముఖి శోభాని ప్రశ్నిస్తూ అసలు ఏం చూసి తనని ప్రేమించావు అని అడిగితే తను చాలా కేరింగ్ పర్సన్ అంటూ సమాధానం చెప్పినటువంటి శోభ వెంటనే తన ఇంస్టాగ్రామ్ మొత్తం చూసాను ఎక్కడ కూడా అమ్మాయిల ఫాలోయింగ్ లేదు అందుకే తనని ప్రేమించాను అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

కేరింగ్ పర్సన్..

ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక నటుడు బిగ్ బాస్ మానస్ బ్రో నీ ఫ్యూచర్ నాకు అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఇక యశ్వంత్ రెడ్డి కార్తిక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు.. తాను చెల్లి వరుస అవుతానంటూ ఆమె నిరాకరించింది.. దీంతో

కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఇటు విద్యిర్థినీ విద్యార్థులు చాలామందికి స్నేహితులుగా మారుతారు. కొంతమందికి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే జంటలు చాలా తక్కువగా ఉంటుంది. ధైర్యం చేసి ఇంట్లో చెప్పకపోవడం, టైం పాస్ గా లవ్ చేసి ఎవరి దారి వాళ్లు చూసుకోవడం.. ప్రేమ అంటే ఎంటో అర్థం తెలియకుండా.. ఎట్రాక్షన్ ను ప్రేమ అనే భ్రమలో ఉండటం లాంటి కారణాలతో పెళ్లి అనే కార్యం వరకు కొన్ని జంటలు వెళ్లవు.

అయితే మరికొన్ని జంటలు నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కులాలు వేరు కావడంతో ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకునే జంటలో కూడా ఇరు కులాలు ఒక్కటే.. దీంతో ఆయువకుడు ఆమె ప్రేమ కోసం తహతహలాడుతూ ఓ రోజు ప్రపోజ్ చేశారు. ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుతున్నారు.

కానీ ఆమె అతడికి ఒక షాకింగ్ నిజం చెప్పింది. తాను నీకు చెల్లి వరుస అవుతానని. దీంతో ఆ యువకుడికి నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ప్రేమను ఆ యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తర్వాత 5 రోజులకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటు చేసుకుంది.

సంతులాల్‌పోడు తండా చెందిన వంశీ.. మహబూబాబాద్‌లో ఇంటర్‌ చదువుతూ ఉన్నాడు. కాలేజీలో గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ప్రేమిస్తున్నానని చెప్పడంతో చెల్లి వరుస అవుతాను అంటూ ఆమె చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.