Tag Archives: madras

SV Krishna Reddy: నాకు ఏ పని రాదంటూ కామెంట్స్ చేశారు… చివరికి స్వీట్ షాపులో పనిచేశా: ఎస్వీ కృష్ణారెడ్డి

SV Krishna Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా సంగీత దర్శకుడిగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలన్నీ కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబ విలువలను ఎంతో అద్భుతంగా చాటిచెప్పే సినిమాలను ఎస్వీ కృష్ణారెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే చాలా సంవత్సరాలు తర్వాత ఈయన తిరిగి మెగా ఫోన్ పట్టబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాది ఉన్నతమైన కుటుంబం కానీ సినిమాలు చేసే అంత డబ్బు మా దగ్గర లేదు.పీజీ పూర్తి చేసే హీరో అవుదాం అనుకొని మద్రాసు వెళ్లాను కానీ అది అంత తేలికైన విషయం కాదని తెలుసుకున్నాను.ఇలా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ మొదటిసారి తాను పగడపు పడవలు అనే సినిమాలో సెకండ్ హీరోగా నటించాను. నన్ను చూసిన అచ్చిరెడ్డి నీకు ఇది సరైనది కాదు మనమే ఓ సినిమా చేద్దామని సలహా ఇచ్చారు.

SV Krishna Reddy: ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయలేదు…


ఇలా తన దగ్గర ఏమాత్రం డబ్బు లేకపోయినా సినిమా ఎలా చేయగలమని చెబితే ఆయన తన పేరు మీద ఒక స్వీట్ షాప్ పెట్టారు. నేను అందులో కాజాలు లడ్డులు చేస్తూ పనిచేసాను. ఇలా వచ్చిన డబ్బుతో కొబ్బరి బొండం అనే సినిమా చేసాము.మొదటి సినిమా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత తాను సినిమాలు చేస్తూ ఉండగా ఇండస్ట్రీలో తనపై చాలామంది విమర్శలు చేశారు. తనకు సినిమా డైరెక్షన్ రాదు మ్యూజిక్ డైరెక్షన్ రాదు. ఘోస్ట్ లనుపెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే అలా విమర్శలు చేయడానికి కారణం లేకపోలేదు. తాను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకపోవడం వల్ల ఇలాంటి విమర్శలు వచ్చాయని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

తినడానికి తిండి లేని సమయంలో ఎస్.వి.రంగారావు దీనస్థితిని చూసిన అంజలి దేవి ఏం చేశారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్ వి రంగారావు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్.వి.రంగారావు ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో బాధలు, అవమానాలు, ఆకలి కేకలు ఉన్నాయి. వాటన్నింటినీ భరిస్తూ, వాటిని దాటుకొని నటుడిగా సినిమారంగంలో ఓ గొప్ప స్థాయికి చేరుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్క నటుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అలాంటి ఇబ్బందులే ఎస్ వి రంగారావు కూడా ఎదుర్కొన్నారు. ఆర్టిస్ట్ కావాలన్న ఉద్దేశంతో మద్రాసుకు వచ్చిన ఎస్.వి.రంగారావు అక్కడ తేనాంపేటలోని ఎల్డామ్స్ రోడ్ చివరన ఉన్న ఓ ప్రెస్‌లో పడుకోవడానికి నేలపై పేపర్లను పరచుకొని సినిమా కలలను కనేవాడు. ఎస్.వి.రంగారావు తో పాటు తాతా మనవడు సినిమా నిర్మాత కె.రాఘవ ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చారు.

ఈ విధంగా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఎంతో కృంగిపోయిన ఎస్.వి.రంగారావు తినడానికి తిండి లేక కేవలం నీళ్లు తాగుతూ ఆకలిని చంపుతున్నారు. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు రావని భావించిన ఎస్.వి.రంగారావు తిరిగి వెళ్ళాలని భావించినప్పుడు రాఘవ తనని వారించి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎస్.వి.రంగారావుకి నాటకాల ద్వారా వీళ్ళతో పరిచయం ఏర్పడిన అంజలీదేవి వీరి ఆకలి బాధలను చూసి చలించిపోయారు. ఈ క్రమంలోనే అంజలీదేవి వారి ఇంటిలో అయ్యర్ లకు చెప్పి వారు ఎప్పుడు వచ్చిన భోజనం లేదనకుండా పెట్టాలని సూచించారు. అలా అంజలిదేవి వారి ఆకలి బాధలను తీర్చారు. ఇక ఎస్వీరంగారావు హీరోగా నటించినటువంటి మొదటి చిత్రం “వరూధిని” ఫ్లాప్ అవ్వడంతో ఆయన పరిస్థితి మరీ మొదటికి వచ్చింది.

ఇలా అవకాశాల కోసం వెతుకుతునప్పటికీ అయిదారు చిత్రాలలో నటించిన ఎలాంటి గుర్తింపు లేదు. ఇక ఇండస్ట్రీని వదిలి పెళ్లి చేసుకుని ఉద్యోగంలో చేరిన ఎస్.వి.రంగారావు కు దర్శకుడు సుబ్బారావు నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే 1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమాలోని నేపాళ మాంత్రికుడు పాత్రలో నటించిన ఎస్ వి రంగారావుకు ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వరుస అవకాశాలతో అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు.