Tag Archives: manchu lakshmi

శ్రీయ సరన్ ప్రెగ్నేన్సీపై.. మంచు లక్ష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

సాధారణంగా ప్రస్తుతం ఏ చిన్న సీక్రెట్ దాచాలని అనుకున్నా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎంత దాచేసినా క్షణాల్లోనే పాకిపోతుంది.. వైరల్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో శ్రియ సరన్ మాత్రం చాలా పెద్ద సీక్రేట్ ఏడాది పాటు దాచేసింది.

కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. ఉన్నట్లుండి ఈ రహస్యం బయటికి చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం సంతోషకరమైన విషయమే కానీ.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటే బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్‌ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఆమె ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది. శ్రీయ పోస్టుకు ఆమె రీ ట్వీట్ చేసింది. శ్రీయకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘‘ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడంలో నువ్వు తీసుకున్న సమయం విషయమై నిన్ను చూసి గర్వపడుతున్నా. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం.

అది అందరికీ సమయానికి చెప్పాల్సిన అవసరం లేదు” అని తెలిపింది. ప్రస్తుతం మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని శ్రీయ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలారోజుల తర్వాత మళ్లీ RRR మూవీలో నటిస్తోంది.

నా ఇల్లు కాలి పోయినప్పుడు అదొక్కటే మిగిలింది : మంచు లక్ష్మి

సినిమా ఇండస్ట్రీలో నటిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మీ మంచు నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే నటి లక్ష్మీ మంచు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కామెంట్లు, చేయడంతో అది కాస్తా పలు వివాదాలకు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం చాలామంది సినిమా సెలబ్రిటీలు తమ పేరిట యూట్యూబ్ చానల్స్ స్టార్ట్ చేసి హోమ్ టూర్స్, వివిధ రకాల వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం పరిపాటిగా మారిపోయింది.

తాజాగా నటి మంచు లక్ష్మి కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి హైదరాబాదులో తన ఉంటున్న ఇంటిని హోమ్ టూర్ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తన ఇంటిని చూపించిన లక్ష్మి మంచు తన ఇంటిలోని వస్తువుల గురించి ప్రత్యేకించి అభిమానులకు తెలియజేశారు.

ముఖ్యంగా తన ఇంటిని చూపిస్తూ తనకు పెయింటింగ్స్ అంటే ఎంతో ఇష్టమని, తన ఇంటిలో ఉన్నటువంటి పెయింటింగ్స్ అన్నింటిని చూపించారు. అదేవిధంగా టీ కలెక్షన్, జువెలరీ కలెక్షన్, ఫోటో కలెక్షన్స్ అన్నింటిని ఈ వీడియో సందర్భంగా చూపించారు.అయితే కాలానికి అనుగుణంగా తన ఇంటిలో మార్పులు చేసుకుంటూ తన ఇష్టానికి అనుగుణంగా తన ఇంటిని తీర్చిదిద్దిన్నట్లు తెలిపారు.

ఇకపోతే ఈ సందర్భంగా మంచు లక్ష్మి యూఎస్‌లో ఉన్నప్పుడు తన ఇల్లు ప్రమాదానికి గురైందని,ఈ ప్రమాదంలో ఇల్లు మొత్తం కాలిపోయిన తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ మాత్రం మిగిలిందని, ఆ పెయింటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా లక్ష్మీ మంచు తెలియజేశారు . అలాగే తన ఇంటిలో ఉన్న డైనింగ్ టేబుల్ ప్రత్యేకతను ఈ వీడియో సందర్భంగా తెలియజేశారు. ఈ డైనింగ్ టేబుల్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల భోజనం చేయటం వల్ల దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

మంచు లక్ష్మీ లగ్జరీ హౌస్ చూశారా.. రెండు కళ్లు చాలవేమో..!

యాంకర్ గా.. నటిగా.. నిర్మాతగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు మంచు లక్ష్మీ. ఎటువంటి సందర్భంలో అయినా ఆమె తను అనుకున్నది చెప్పేస్తోంది. ధైర్యంగా తన అభిప్రాయాలను పంచుకుంటారు. లాక్ డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులకు టచ్ లో ఉంటోంది. గతంలో కూడా ఆమె సోషల్ మీడియా వేదికలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేది.

ప్రస్తుతం ఎక్కువ సమయం ఆమె సోషల్ మీడియాకు కేటాయిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా ప్రారంభించారు. దానిలో ఆమె ఎన్నో విషయలను ఆమె అభిమానులతో పంచుకోనున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్ చానల్ లను మొదలు పెట్టి తమ అభిమానులకు దగ్గర అవుతున్నారు. మహమ్మారి కారణంగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలామంది వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఉన్నారు.

తాజాగా మంచు లక్ష్మీ తన లగ్జరీ హౌస్ గురించి వీడియో చేయబోతోంది. ఈ వీడియోకు సంబంధించిన ప్రోమో ను ఆమె తన యూట్యూబ్ చానల్ లో విడుదల చేశారు. ఆ ప్రోమోలో ఆమె ఇల్లు ఎంతో అద్భుతంగా కినిపిస్తోంది. ఇంటి మెయిన్ గేట్ నుంచి పార్కింగ్ సెల్లార్.. ఇంటిలో వివిధ గదులు అత్యాధునిక హంగులతో కనిపిస్తున్నాయి. గదుల్లో వేసే ఇంటీరియర్ డిజైన్ అయితే మాత్రం చూడటానికి రెండు కళ్లు చాలవు. అలా ఉంది మరి డిజైన్.

అంతేకాకుండా వివిధ రకాల చిత్రపటాలతో ఇంటిని నింపేసింది. ఆ చిత్ర పటాలు గదులకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. లైబ్రరీ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. హోమ్ థియేటర్స్ కోసం కూడా ప్రత్యేకంగా గదిని డిజైన్ చేయించింది. ప్రోమోలోనే ఇలాంటివి ఉన్నాయంటే ఫుల్ వీడియో విడుదల అయితే అందులో ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించుకోండి.

ఆ దర్శకుడితో మళ్లీ రచ్చ చేసిన మంచు లక్ష్మి…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న కథలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పిట్టకథలు సినిమా తెరకెక్కింది. ఇందులో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించారు. అయితే మరోసారి ఈ దర్శకుడితో కలిసి లక్ష్మీ మంచు రచ్చ చేశారు. అయితే ఈసారి సినిమా కోసం కాదు.. వంట చేయడం కోసం వీరిద్దరూ మరోసారి కలిశారు.

మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా “ఆహా” యాప్ ద్వారా ప్రసారమవుతున్న “ఆహా భోజనంబు”అనే కార్యక్రమం ద్వారా మంచులక్ష్మి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై వివిధ రకాల వంటలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ , అదేవిధంగా రెండవ ఎపిసోడ్ కు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఎంతో సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమం మూడవ ఎపిసోడ్ లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ మళ్లీ మేమిద్దరం కలిసాము.. అయితే వంట చేయడానికి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోగ్రామోలో భాగంగా మంచు లక్ష్మి తరుణ్ భాస్కర్ ఎంతో సరదాగా ముచ్చటిస్తూ వంటలను వండారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ చక్కెర పొంగలి, టమోటా చారు ఏ విధంగా తయారు చేయాలో చూపించారు. వీరిద్దరి మధ్య ఎంతో సరదాగా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 6వ తేదీన ఆహా యాప్ లో ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి అఖిల్, విష్ణు, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా రానున్నట్లు సమాచారం.

గొడ్డలి పట్టుకున్న మంచు లక్ష్మి.. ఎవరైనా అలా చెప్తే ఫసక్!

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికి తెలిసిందే. పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. మోహన్ బాబు కూతురుగా బాగా పరిచయం పెంచుకుంది. తను మాట్లాడే భాష పట్ల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది. బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి.. ఓ చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిని ఆవేశంగా చూపిస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోకి వెకేషన్ అయిపోయిందని చెబితే.. తను అలా రియాక్ట్ అవుతానని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికి తెలిసిందే.

పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.

మోహన్ బాబు కూతురుగా బాగా పరిచయం పెంచుకుంది.

తను మాట్లాడే భాష పట్ల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి..

ఓ చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిని ఆవేశంగా చూపిస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

ఇక ఈ ఫోటోకి వెకేషన్ అయిపోయిందని చెబితే..

తను అలా రియాక్ట్ అవుతానని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

‘రానా’ టాటూ వెనక అంత పెద్ద సీక్రెట్ ఉందా..??

మన సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా అది ఫ్యాషనే..ముఖ్యంగా చాలామంది సెలెబ్రిటీలు తమ ఒంటిపై టాటూస్ వేయించుకుంటుంటారు.. అది కూడా ఒక ఫ్యాషన్ అని ఫీలవుతుంటారు వాళ్లు.. హీరోల్లో కొంతమంది మాత్రమే దీన్ని ఫాలో అయితే.. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్స్ మాత్రం పర్మినెంట్ టాటూలు వేయించుకుంటారు. త్రిష, నయనతార, సమంతా, రష్మిక ఒకరేమిటీ చాలా మంది నటీమణు తమ ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు.

పలువురు హీరోలు సైతం తమకు నచ్చిన టాటూలు వేయించుకున్నారు. నాగార్జున భుజంపై పెద్ద చక్రం టాటూ ఉంటుంది. రానా కూడా ఒంటిపై ఓ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. కాకపోతే ఆ టాటూ ఎక్కడ వేసుకున్నాడు? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి అనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ఆ పచ్చబొట్టు లేకపోతే బాగుండు అని తాజాగా ఆయన వెల్లడించాడు.రీసెంట్ గా రానా హోస్ట్ చేస్తున్న ఓ షోకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మోహన్ బాబు ముద్దుల బిడ్డ కలిసి వచ్చారు.

కాసేపు షోలో ఫన్నీ ముచ్చట్లు పెట్టారు. ఒకరిపై మరొకరు క్వశ్చన్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాటూ వేసుకోవాలని అనుకంటే ఎవరిది వేసుకుంటావని రానాను అడిగారు.దీనికి రానా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. ఎవరి పేరును వేయించుకుంటాను అనే విషయం పక్కనపెడితే.. ముందుగా తన ఒంటిపై ఉన్న టాటూ డిజైన్ మార్చుకోవాలని ఉందన్నాడు. అది తనను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పాడు.

ఇక ఎవరి పేరో వేయించుకోవడం కంటే తన పేరునే తన ఒంటిపై పచ్చబొట్టుగా వేయించుకుంటానని చెప్పాడు. దాని వలన ఎవరికి ఎలాంటి అనుమానం కలుగదని చెప్పాడు. పైగా తన పేరుతో తన తాత పేరు కూడా ఉందన్నాడు.అయితే.. ఇప్పటికే తన ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ ఏంటి అనేది మాత్రం రానా చెప్పలేదు. కానీ నెటిజన్లు ఆ టాటూ గురించి వెతికే పనిలోపడ్డారు. రానా డేటింగ్ చేసిన ఏ హీరోయిన్ పేరో అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు..!!