Tag Archives: MM Srelekha

MM Srelekha: చెల్లెలిని దూరం పెట్టిన కీరవాణి, జక్కన్న.. ఒక్కఫోటోతో క్లారిటీ ఇచ్చిన ఎం ఎం శ్రీలేఖ!

MM Srelekha: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి ఆయన సోదరుడు కీరవాణి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి కీరవాణి సంగీతం తోడైతే ఆ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే.తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో మేజర్ సక్సెస్ క్రెడిట్ తన అన్నయ్య కీరవాణిదే అని రాజమౌళి చెప్తుంటారు. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే.. కీరవాణి తన పాటతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు పలు ప్రశంసలు, పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు కీరవాణి బాణీలు అందించటమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తమ వంతు పనిచేస్తూ సినిమా సక్సెస్ చేయటానికి కష్టపడుతూ ఉంటారు. రాజమౌళి భార్య రమా, కొడుకు కార్తీకేయ, కీరవాణి, ఆయన భార్య శ్రీవల్లి, కొడుకు భైరవ, తమ్ముడు కళ్యాణి మాలిక్ సినిమాకోసం కష్టపడుతూ ఉంటారు.

ఇలా కుటుంబానికి చెందిన వారందరూ కలిసి సమిష్టి కృషితో సినిమాని సక్సెస్ చేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కీరవాణి చెల్లెలు ఎం ఎం శ్రీలేఖ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందింది. అయితే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలలో శ్రీలేఖకు చోటు ఉండదు. అందువల్ల కీరవాణి, రాజమౌళి ఇద్దరూ తమ సోదరిని దూరం పెట్టారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా శ్రీలేఖ ఎప్పుడూ కనిపించదు. దీంతో అన్నలిద్దరూ కలిసి చెల్లెల్ని దూరం పెట్టారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

MM Srelekha: మ్యూజిక్ వరల్డ్ టూర్…

తాజాగా శ్రీలేఖ షేర్ చేసిన ఒక్క ఫోటోతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. సినిమా రంగంలో ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శ్రీలేఖ ‘మ్యూజిక్ వరల్డ్ టూర్ ‘చేపట్టింది. ఈ వరల్డ్ టూర్ కి సంబంధించిన పోస్టర్ ని రాజమౌళి స్వయంగా రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా శ్రీలేఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సోదరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంతకాలం అన్నాచెల్లెళ్ల మధ్య ఎడబాటు ఉందని వస్తున్న వార్తలకు ఈ ఒక్క ఫోటోతో శ్రీలేఖ సరైన సమాధానం చెప్పింది.

MM Srelekha: నాయుడు గారు నన్ను, దాసరిని కోటి రూపాయలు పోగొట్టినందుకు తిట్టేవారు.. సంగీతం నేర్పమంటే బాలుగారు అలా అన్నారు: ఎం ఎం శ్రీలేఖ

MM Srelekha: ఎం ఎం శ్రీలేఖ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ సంగీత దర్శకురాలు. ఈమె చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తనకు కూడా సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడింది. శంకరాభరణం సినిమా చూసి తాను సింగర్ గా స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నానని శ్రీలేఖ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇకపోతే ఎం ఎం కీరవాణి అన్నయ్యతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అలా సంగీత దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

తన మొట్టమొదటి సినిమా తమిళ హీరో విజయ్ తో చేశానని తెలిపారు. ఇకపోతే కొండపల్లి రత్తయ్య సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహించానని,ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రామానాయుడు ఎప్పుడూ కూడా కోటిపల్లి రత్తయ్య అంటూ నన్ను దాసరి గారిని కలిపి తిట్టే వారు అంటూ ఈ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు.ఈ సినిమాకు దాసరి దర్శకత్వం వహించగా,తాను సంగీత దర్శకత్వం వహించానని ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కోటి రూపాయలు నష్టం రావడం వల్ల నాయుడు గారు చనిపోయేవరకు మమ్మల్ని కోటి రూపాయలు గురించి ప్రస్తావిస్తూ తిట్టేవారు అంటూ సరదాగా తెలియజేశారు.

ఇకపోతే తాను ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఎన్నో మంచి హిట్ అందుకున్నాయి.ఇకపోతే తన కెరీర్లో ఏ విధమైనటువంటి ఆటుపోట్లు ఎదురయ్యాయ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్కడైనా మంచి ఉంది అంటే తప్పకుండా చెడు కూడా ఉంటుంది.నా కెరీర్లో కూడా అలాంటి ఆటుపోట్లు ఉన్నాయి అయితే నేను పెద్దగా వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు.

గాడిద గొంతు అన్నారు…

ఇకపోతే తనకు సంగీత దర్శకురాలిగా కన్నా సింగర్ గా పాట పాడటం ఎంతో ఇష్టం ఇలా సింగర్ కావాలని కోరుకుంటున్నట్లు ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏదో ఇష్టపడుతుంది కదా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకువెళ్లి సంగీతం నేర్పించాలని అడిగారు. ఈ విధంగా అడిగేసరికి బాలు గారు నేను తనకి సంగీతం నేర్పించనని మొహం మీదే చెప్పారు. తన గొంతు గాడిద గొంతులా ఉంది. తనకు నేను సంగీతం నేర్పించనని బాలు గారు చెప్పినట్టు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎం.ఎం.శ్రీలేఖ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.