MM Srelekha: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి ఆయన సోదరుడు కీరవాణి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి కీరవాణి సంగీతం తోడైతే ఆ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే.తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో మేజర్ సక్సెస్ క్రెడిట్ తన అన్నయ్య కీరవాణిదే అని రాజమౌళి చెప్తుంటారు. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే.. కీరవాణి తన పాటతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు పలు ప్రశంసలు, పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు కీరవాణి బాణీలు అందించటమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తమ వంతు పనిచేస్తూ సినిమా సక్సెస్ చేయటానికి కష్టపడుతూ ఉంటారు. రాజమౌళి భార్య రమా, కొడుకు కార్తీకేయ, కీరవాణి, ఆయన భార్య శ్రీవల్లి, కొడుకు భైరవ, తమ్ముడు కళ్యాణి మాలిక్ సినిమాకోసం కష్టపడుతూ ఉంటారు.
ఇలా కుటుంబానికి చెందిన వారందరూ కలిసి సమిష్టి కృషితో సినిమాని సక్సెస్ చేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కీరవాణి చెల్లెలు ఎం ఎం శ్రీలేఖ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందింది. అయితే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలలో శ్రీలేఖకు చోటు ఉండదు. అందువల్ల కీరవాణి, రాజమౌళి ఇద్దరూ తమ సోదరిని దూరం పెట్టారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా శ్రీలేఖ ఎప్పుడూ కనిపించదు. దీంతో అన్నలిద్దరూ కలిసి చెల్లెల్ని దూరం పెట్టారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా శ్రీలేఖ షేర్ చేసిన ఒక్క ఫోటోతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. సినిమా రంగంలో ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శ్రీలేఖ ‘మ్యూజిక్ వరల్డ్ టూర్ ‘చేపట్టింది. ఈ వరల్డ్ టూర్ కి సంబంధించిన పోస్టర్ ని రాజమౌళి స్వయంగా రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా శ్రీలేఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సోదరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంతకాలం అన్నాచెల్లెళ్ల మధ్య ఎడబాటు ఉందని వస్తున్న వార్తలకు ఈ ఒక్క ఫోటోతో శ్రీలేఖ సరైన సమాధానం చెప్పింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…