Samantha: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేషధారణ నటన సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక నటన కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఉ అంటావా ఉ ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ గా చెప్పవచ్చు.
ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ పాట విడుదల చేయటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రమంలో పుష్ప2 లో కూడా సమంతతో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దీనికోసం పుష్ప 2 మేకర్స్ సమంతను సంప్రదించారని, కానీ ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప2 సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించలేదని సమంతా సన్నిహితుల నుండి సమాచారం. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకున్న సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇక విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో తొందర్లోనే పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఏప్రిల్ 14వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్ లో ఈ సినిమాకు సంబందించిన ఒక షెడ్యూల్డ్ షూటింగ్ పూర్తి చేశారు.
పుష్ప సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి థియోటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ ఇండస్త్రీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. దీంతో పుష్ప 2 సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా సుకుమార్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…