Tag Archives: multistarrer movie

Varun Tej: మెగా ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. అలా చెప్పేసిన వరుణ్ తేజ్!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వరుణ్ తేజ్ తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మెగా ఫ్యామిలీ నుంచి మల్టీ స్టార్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇప్పటికే మెగా హీరోలు కలిసి మల్టీ స్టార్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలో ఇంకా ఇలాంటి మల్టీ స్టార్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ మంచి కథ దొరికితే తప్పకుండా మల్టీ స్టార్ సినిమాలలో నటిస్తామని తెలిపారు. దర్శకులు కూడా అలాంటి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తాము అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మెగా హీరోల మల్టీ స్టార్ సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Varun Tej: ఆకట్టుకోలేని మెగా మల్టీ స్టార్ సినిమాలు….

ఇకపోతే ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ గా బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి.

సామ్యవాద ముసుగులో మసాలా సినిమా.. అని ఆ రోజుల్లో ఈ బ్లాక్ బస్టర్ గురించి ఓ పత్రిక ఎందుకు రాయాల్సివచ్చింది.?!

స్వయంకృషితో వచ్చిన అతి కొద్ది మంది దర్శకుల్లో కె.బాపయ్య ఒకరు “ప్రేమ్ నగర్” చిత్రానికి కె.ఎస్. ప్రకాశరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత 1970లో ఎస్.వి.రంగారావు ప్రధాన పాత్రలో “ద్రోహి” అనే చిత్రానికి మొదటి సారిగా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుతో రూపొందించిన “ఎదురులేని మనిషి” చిత్రం డిసెంబర్ 12, 1975 న విడుదలై 6 సెంటర్ లలో వందరోజులు ఆడి మంచి విజయం సాధించడంతో కె.బాపయ్యకు మంచి పేరు వచ్చింది.

అదే సంవత్సరం శోభన్ బాబు తో తీసిన “సోగ్గాడు” చిత్రం డిసెంబర్ 19, 1975న విడుదలై 19 సెంటర్లలో వందరోజులు ఆడి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కె.బాపయ్యను మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఆ క్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ లో మరో అవకాశం వచ్చింది. డి.రామానాయుడు, కె.బాపయ్య మంచి కథ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. అప్పటికే చలిచీమలు, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈ చరిత్ర ఏ సిరాతో లాంటి సామ్యవాద భావాలతో కూడిన చిత్రాలకు కథలు రాసి సాధారణ విజయాలతో ముందుకు వెళుతున్న పరుచూరి సోదరులను కలవడం జరిగింది.

1983 జనవరిలో సురేష్ ప్రొడక్షన్స్, కె.బాపయ్య దర్శకత్వంలో మల్టీస్టారర్ “ముందడుగు” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలలో గుమ్మడి వెంకటేశ్వరరావు, శివకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. శివకృష్ణ ప్రజాస్వామ్య ఆలోచనలు, అభ్యుదయ భావాలు గల వ్యక్తి సమసమాజ స్థాపన ద్యేయంగా.. శివకృష్ణ తమ ఆస్తిని ప్రజలకు పంచుతాడు. పెట్టుబడిదారి విధానం ఆలోచనల గల రావుగోపాల్ రావు ఒక సంస్థను స్థాపిస్తారు. శోభన్ బాబు కోటీశ్వరుడుగా నటించగా.. హీరో కృష్ణ లారీడ్రైవర్ గా నటించారు.

ప్రజాస్వామ్య, సామ్యవాద కమ్యూనిజం సిద్ధాంతాల భావజాలం చుట్టూ కథ నడుస్తుంది. కమర్షియల్ హంగులు అద్దడంతో ఆ రోజుల్లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీలో కృష్ణ సినిమాల్లో ఓక కోటి రూపాయిల గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత డి.రామానాయుడు రజతోత్సవాన్ని చెన్నై “తాజ్ హోటల్” లో నిర్వహించారు. అయితే ఈ అద్భుత విజయాన్ని గురించి ఆ రోజుల్లో కొన్ని పత్రికలు కీర్తించాయి. ముఖ్యంగా సితార సినీ పత్రిక “ముందడుగు” చిత్రం గురించి సామ్యవాద భావాలు గల మసాలా చిత్రమని రాయడం సినీ పరిశ్రమలో అప్పట్లో చర్చనీయాంశమైంది.