Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వరుణ్ తేజ్ తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మెగా ఫ్యామిలీ నుంచి మల్టీ స్టార్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇప్పటికే మెగా హీరోలు కలిసి మల్టీ స్టార్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలో ఇంకా ఇలాంటి మల్టీ స్టార్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ మంచి కథ దొరికితే తప్పకుండా మల్టీ స్టార్ సినిమాలలో నటిస్తామని తెలిపారు. దర్శకులు కూడా అలాంటి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తాము అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మెగా హీరోల మల్టీ స్టార్ సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ గా బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…