Tag Archives: nellore district

Singeetham Srinivasa Rao: 9o ఏళ్లను పూర్తి చేసుకున్న చలనచిత్ర దార్శనిక దర్శకుడు సింగీతం శ్రీనివాస్… వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

Singeetham Srinivasa Rao: సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేస్తూ ప్రేక్షకులకు ప్రతి ఒక్క జానర్ లో సినిమాలను పరిచయం చేసిన దర్శకులలో ముందు వరుసలో ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఈయన నేడు 90 వ ఏళ్లను పూర్తిచేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి ఈయన నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున ఈయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1931 సెప్టెంబర్ 21వ తేదీ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఈయన నాటకాలపై మక్కువతో చిన్నప్పటినుంచి నాటకాలలో నటించేవారు. ఈ క్రమంలోనే థియేటర్ ఆర్ట్స్ లోడిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ రావు సంగీతంపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. కెవి.రెడ్డి డైరెక్ట్ చేసిన యోగి వేమన, భక్తపోతన చిత్రాలను చూసి స్ఫూర్తి పొందాడు. వెంటనే దర్శకుడు కావాలన్న కోరికతో చెన్నై వెళ్లి కే.వి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి ఈయన తన డైరెక్టర్ గా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మయూరి ఆదిత్య 369,భైరవద్వీపం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఈయనకే చెల్లిందని చెప్పాలి.

Singeetham Srinivasa Rao: ప్రాజెక్టు కే లో సింగీతం శ్రీనివాస్…

ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈయన ప్రస్తుతం నాకు అశ్విన్దశకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ప్రాజెక్టుకే సినిమాలు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.ఇలా ఎన్నో ఏళ్లగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నటువంటి ఈయన నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

మోసం చేసి పెళ్లి చేశారు.. ఏడాది తర్వాత ఆమె జీవితం ఆగమ్యగోచరంగా మారింది..!

ఆమెకు చెప్పకూడని అబద్దాలు చెప్పి పెళ్లి చేశారు. వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తర్వాత అనారోగ్యంతో భర్త మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డితో కొంతకాలం వివాహం జరిగింది.

తర్వాత అతడికి రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులు ముందుగానే తెలుసు. కానీ ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. ఇదే కాకుండా కొన్నాళ్లకు అతడికి మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి.

ఇలా మానసికంగా, శారీరకంగా ఎంత కాలం బాధపడుతూ.. కుటుంసభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది. ఓ రోజు తన అత్తమామల ఇంటికి తన ఆరు నెలల కొడుకుతో బయలుదేరి వెళ్లింది. కానీ వాళ్లు ఆ ఇంటికి స్వాగతించలేదు. ఇంటికి వచ్చిన ఆమెపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహమాత్రం అక్కడే బైఠాయించింది.

గతంలోనూ ఇదేవిధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని ఊహ వాపోతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది.

నవ వధువు కిడ్నాప్.. టీడీపీ నేతపై ఆరోపణలు.. ఏం జరిగిందంటే..!

ఆ రోజే వారిద్దరికి పెళ్లైంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ నవవధువు ఆరోజు రాత్రే కిడ్నాప్ కు గురైంది. ఎక్కడ జరిగింది.. ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కత్తి ఉమామహేశ్వరి.. అన్నారెడ్డిపాళెం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నలబాయి హరి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇంట్లో వారి ప్రేమ విషయం చెప్పగా.. కత్తి ఉమామహేశ్వరి ఇంట్లో ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఓ రోజు రాత్రి పక్కనే ఉన్న పెంచలకోనలోకి వెళ్లి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత హరి ఇంటికి తన భార్యను తీసుకొని వచ్చాడు. అదే రోజు రాత్రి వధువు ఊరు అయిన విడవలూరుకు చెందిన టీడీపీ నేత సత్యవోలు సత్యంరెడ్డి హరి ఇంటికి వచ్చాడు.

దాదాపు 30 మందిని వెంట పెట్టుకొని ఆటోలో వచ్చారు. రాగానే అతడు హరి ఇంట్లోకి వెళ్లి ఉమాపహేశ్వరిని తీసుకొని భయటకు వచ్చాడు. ఆమెను బలవంతగా తీసుకొని వెళ్తుంటే.. హరి అడ్డుకున్నాడు. అతడిని కులం పేరుతో దూషించి.. పక్కకు నెట్టాడు. ఆమెను తీసుకొని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీంతో హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నలబాయి హరి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వధువు తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. వాళ్లు టీడీపీ నాయకుడిని కలిసి.. సహాయం కోరినట్లుగా సమాచారం. దీంతో అతడు ఆ వధువును కిడ్నాప్ చేశాడు. కానీ ఆమెను ఇంటికి మాత్రం తీసుకురాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.