ఆమెకు చెప్పకూడని అబద్దాలు చెప్పి పెళ్లి చేశారు. వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తర్వాత అనారోగ్యంతో భర్త మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డితో కొంతకాలం వివాహం జరిగింది.
తర్వాత అతడికి రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులు ముందుగానే తెలుసు. కానీ ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. ఇదే కాకుండా కొన్నాళ్లకు అతడికి మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి.
ఇలా మానసికంగా, శారీరకంగా ఎంత కాలం బాధపడుతూ.. కుటుంసభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది. ఓ రోజు తన అత్తమామల ఇంటికి తన ఆరు నెలల కొడుకుతో బయలుదేరి వెళ్లింది. కానీ వాళ్లు ఆ ఇంటికి స్వాగతించలేదు. ఇంటికి వచ్చిన ఆమెపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహమాత్రం అక్కడే బైఠాయించింది.
గతంలోనూ ఇదేవిధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని ఊహ వాపోతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…