ఆమెకు చెప్పకూడని అబద్దాలు చెప్పి పెళ్లి చేశారు. వివాహం జరిగి ఏడాది పూర్తయింది. తర్వాత అనారోగ్యంతో భర్త మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డితో కొంతకాలం వివాహం జరిగింది.
తర్వాత అతడికి రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులు ముందుగానే తెలుసు. కానీ ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. ఇదే కాకుండా కొన్నాళ్లకు అతడికి మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి.
ఇలా మానసికంగా, శారీరకంగా ఎంత కాలం బాధపడుతూ.. కుటుంసభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఆమె అప్పటికే గర్భవతిగా ఉంది. ఓ రోజు తన అత్తమామల ఇంటికి తన ఆరు నెలల కొడుకుతో బయలుదేరి వెళ్లింది. కానీ వాళ్లు ఆ ఇంటికి స్వాగతించలేదు. ఇంటికి వచ్చిన ఆమెపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహమాత్రం అక్కడే బైఠాయించింది.
గతంలోనూ ఇదేవిధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని ఊహ వాపోతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…