Tag Archives: newly married couple

పెళ్లైన నెల రోజులకే నవ వధువు హత్య.. కారణం ఏంటంటే..!

అన్ని బంధాల కంటే వివాహ బంధం చాలా గొప్పది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. పిల్లలలో జీవితాంతం కలిసి ఉండాల్సింది భార్యభర్తలే. అయితే మధ్యలో చిన్న చిన్న మనస్పర్థలు లాంటివి వస్తే.. వాటిని సర్దుకుంటూ ముందుకు వెళ్లాలి.

ఇలానే తమ సంసార జీవితాన్నిచాలామంది గడుపుతారు. ఒకరికి కోపం వచ్చిందంటే.. మరొకరు కూల్ గా ఉంటూ సహనం పాటించాలి. లేదంటే.. ఇద్దరి కోపాలతో క్షణికావేశంతో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వాళ్లకు పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు.. నవ వధువు కన్నుమూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు.. పెళ్లైన నెలకే కన్నుమూసింది.

కిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతడికి 22 ఏళ్ల సుధారాణితో నెల రోజులక్రితం పెళ్లి అయింది. పెళ్లి తర్వాత ఇద్దరు 20 రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రోజు నుంచి అతడు తన భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు.

అనుమానం అనే భూతం ఒక్కసారి మొదలైందంటే.. అది తొలగిపోవడం అనేది చాలాకష్టం. దీంతో అతడు ఆవేశంతో ఓ అర్థరాత్రి తన భార్య గొంతుకోసి చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివాహం జరిగి మూడు రోజులు.. అప్పడే గొడవలు.. కోపంతో భర్త ఏం చేశాడంటే..?

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సాధారణం. అయితే అవి ఎంతో కాలంగా ఉండవు. ఈ రోజు గొడవపడితే మరుసటి రోజు సర్దుకుపోతారు. కానీ పెళ్లి జరిగి మూడు రోజులు కూడా కాలేదు… అప్పుడే వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆ నవవరుడు కత్తితో చెయ్యిని కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్ కు చెందిన బాబాకు ఓ యువతితో మూడు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి వరకు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉన్నారు. పెళ్లి సమయంలో కూడా ఎలాంటి గొడవలు కాలేదు. తర్వాత పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే బాబాకు అతడి భార్యకు రెండో రోజు నుంచే మనస్పర్థలు వచ్చాయి.

ఒకరంటే ఒకరికి పడనంతగా తయారయ్యాయి ఆ గొడవలు. దీంతో యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి కనీసం మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే గొడవలు ఏంటని.. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని.. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాళ్లల్లో మార్పు రాలేదు. దీంతో బాబా తట్టుకోలేక పదునైన కత్తి తీసుకొని చెయ్యి, వీపు భాగాన కోసుకున్నాడు.

దీంతో రక్తస్రావం కాగా అతడిని కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన మూడు రోజులకే ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి..? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.