అన్ని బంధాల కంటే వివాహ బంధం చాలా గొప్పది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. పిల్లలలో జీవితాంతం కలిసి ఉండాల్సింది భార్యభర్తలే. అయితే మధ్యలో చిన్న చిన్న మనస్పర్థలు లాంటివి వస్తే.. వాటిని సర్దుకుంటూ ముందుకు వెళ్లాలి.
ఇలానే తమ సంసార జీవితాన్నిచాలామంది గడుపుతారు. ఒకరికి కోపం వచ్చిందంటే.. మరొకరు కూల్ గా ఉంటూ సహనం పాటించాలి. లేదంటే.. ఇద్దరి కోపాలతో క్షణికావేశంతో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వాళ్లకు పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు.. నవ వధువు కన్నుమూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు.. పెళ్లైన నెలకే కన్నుమూసింది.
కిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతడికి 22 ఏళ్ల సుధారాణితో నెల రోజులక్రితం పెళ్లి అయింది. పెళ్లి తర్వాత ఇద్దరు 20 రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రోజు నుంచి అతడు తన భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు.
అనుమానం అనే భూతం ఒక్కసారి మొదలైందంటే.. అది తొలగిపోవడం అనేది చాలాకష్టం. దీంతో అతడు ఆవేశంతో ఓ అర్థరాత్రి తన భార్య గొంతుకోసి చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…