ప్రతీ ఒక్క మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నీళ్లు కూడా అంతే ముఖ్యం. ప్రతీ రోజు తగినన్ని నీళ్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ఒక వేళ నీళ్లు మన శరీరానికి తగినన్ని లేకపోతే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వీటిని గమనిస్తూ నీళ్లు తాగాలి. అయితే ఇలా నీళ్లను తాగకపోతే.. శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం..
ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉండగా.. మూత్రం కూడా ముదురు పసుపు లేదా గోధుమ రంగుల్లో వస్తుంది ఇలా వస్తుందంటే.. శరీరంలో తగినంత నీరు లేదనే అర్థం. నోరు కూడా తడి ఆరిపోతుందని.. దీంతో నోట్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
దాని వల్ల నోరు దుర్వాసన కూడా వస్తుందని.. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందుతామని తెలిపారు. నీళ్లను తక్కువగా తాగడం వల్ల రక్త సరఫరాకు కూడా అంతరాయం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అని అతిగా నీళ్లు తాగినా ప్రమాదకరమే. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల మెదడుపై ఆ ప్రభావం పడుతుంది.
బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. అంతే కాకుండా తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. దాదాపు రోజుకు ప్రతీ మనిషి సగటున 4 లీటర్ల నీళ్లు తాగాలని వైద్యలు సలహా.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…