ప్రతీ ఒక్క మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నీళ్లు కూడా అంతే ముఖ్యం. ప్రతీ రోజు తగినన్ని నీళ్లు తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ఒక వేళ నీళ్లు మన శరీరానికి తగినన్ని లేకపోతే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వీటిని గమనిస్తూ నీళ్లు తాగాలి. అయితే ఇలా నీళ్లను తాగకపోతే.. శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం..
ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉండగా.. మూత్రం కూడా ముదురు పసుపు లేదా గోధుమ రంగుల్లో వస్తుంది ఇలా వస్తుందంటే.. శరీరంలో తగినంత నీరు లేదనే అర్థం. నోరు కూడా తడి ఆరిపోతుందని.. దీంతో నోట్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
దాని వల్ల నోరు దుర్వాసన కూడా వస్తుందని.. తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందుతామని తెలిపారు. నీళ్లను తక్కువగా తాగడం వల్ల రక్త సరఫరాకు కూడా అంతరాయం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అని అతిగా నీళ్లు తాగినా ప్రమాదకరమే. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల మెదడుపై ఆ ప్రభావం పడుతుంది.
బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. అంతే కాకుండా తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. దాదాపు రోజుకు ప్రతీ మనిషి సగటున 4 లీటర్ల నీళ్లు తాగాలని వైద్యలు సలహా.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…