భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సాధారణం. అయితే అవి ఎంతో కాలంగా ఉండవు. ఈ రోజు గొడవపడితే మరుసటి రోజు సర్దుకుపోతారు. కానీ పెళ్లి జరిగి మూడు రోజులు కూడా కాలేదు… అప్పుడే వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆ నవవరుడు కత్తితో చెయ్యిని కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్ కు చెందిన బాబాకు ఓ యువతితో మూడు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి వరకు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉన్నారు. పెళ్లి సమయంలో కూడా ఎలాంటి గొడవలు కాలేదు. తర్వాత పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే బాబాకు అతడి భార్యకు రెండో రోజు నుంచే మనస్పర్థలు వచ్చాయి.
ఒకరంటే ఒకరికి పడనంతగా తయారయ్యాయి ఆ గొడవలు. దీంతో యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి కనీసం మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే గొడవలు ఏంటని.. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని.. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాళ్లల్లో మార్పు రాలేదు. దీంతో బాబా తట్టుకోలేక పదునైన కత్తి తీసుకొని చెయ్యి, వీపు భాగాన కోసుకున్నాడు.
దీంతో రక్తస్రావం కాగా అతడిని కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన మూడు రోజులకే ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి..? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…