భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సాధారణం. అయితే అవి ఎంతో కాలంగా ఉండవు. ఈ రోజు గొడవపడితే మరుసటి రోజు సర్దుకుపోతారు. కానీ పెళ్లి జరిగి మూడు రోజులు కూడా కాలేదు… అప్పుడే వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆ నవవరుడు కత్తితో చెయ్యిని కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్ కు చెందిన బాబాకు ఓ యువతితో మూడు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి వరకు ఇరువురి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉన్నారు. పెళ్లి సమయంలో కూడా ఎలాంటి గొడవలు కాలేదు. తర్వాత పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే బాబాకు అతడి భార్యకు రెండో రోజు నుంచే మనస్పర్థలు వచ్చాయి.
ఒకరంటే ఒకరికి పడనంతగా తయారయ్యాయి ఆ గొడవలు. దీంతో యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి జరిగి కనీసం మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే గొడవలు ఏంటని.. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని.. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వాళ్లల్లో మార్పు రాలేదు. దీంతో బాబా తట్టుకోలేక పదునైన కత్తి తీసుకొని చెయ్యి, వీపు భాగాన కోసుకున్నాడు.
దీంతో రక్తస్రావం కాగా అతడిని కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన మూడు రోజులకే ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి..? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…