Tag Archives: November 30

రేషన్ కార్డుదారులకు అలర్ట్. ఈ తప్పు చేస్తే రేషన్ కట్…?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులను చేస్తుంది. అయితే కేంద్రం నిబంధనలలో ఎన్ని మార్పులు చేస్తున్నా కొందరు మాత్రం అక్రమంగా రేషన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొందరు అక్రమంగా రేషన్ పొందుతున్నారు.

కేంద్రం ఇప్పటికే అక్రమంగా రేషన్ పొందుతున్న 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయగా మరి కొంతమంది రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేషన్ కార్డుల ద్వారా అక్రమాలకు తావివ్వకూడదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రద్దు చేసిన రేషన్ కార్డులలో అర్హులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

కేంద్రం ఇప్పటికే మరణించిన వారి రేషన్ కార్డులను తొలగించడంతో పాటు నకిలీ కార్డులు పొందిన వారికి డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా రేషన్ అందకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఎవరైనా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోతే ఈ నెల 30వ తేదీలోగా అనుసంధానం చేయాలి. అలా అప్ డేట్ చేయని వాళ్లు రేషన్ కోల్పోయే లేదా రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.

అందువల్ల రేషన్ కార్డు వినియోగదారులు తప్ప్నిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలను తెచ్చుకుని ఇబ్బంది పడే బదులు ముందుగానే రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసి జాగ్రత్త పడితే మంచిది.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. పండుగకు 200 ప్రత్యేక రైళ్లు?

మరి కొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే కేంద్రం లాక్ డౌన్ నిబంధనల అమలులో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు టికెట్లను చాలా రోజుల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నారు. మరోవైపు కేంద్రం ఆంక్షలు సడలించినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నా టికెట్ ఛార్జీలను భారీగా పెంచడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూడటమే మానేశాయి. అయితే సామాన్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్ కావడంతో 200 ప్రత్యేక రైళ్లను నడపటానికి సిద్ధమవుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.

రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ ఇప్పటికే ప్రత్యేక రైళ్లకు సంబంధించి జోన్ల ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. రైళ్లు నడిపే నమోదవుతున్న కేసులను ఏయే రూట్లలో రైళ్లను నడపాలనే విషయం గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రత్యేక రైళ్లను ఈ నెల 15 నుంచి రైల్వే శాఖ నడిపే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల సూచనల మేరకు రైళ్లను నడిపే విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లను రైల్వే శాఖ నడపనుందని తెలుస్తోంది. పండగ సమయంలో రైల్వే శాఖ తీపికబురు చెప్పడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైతే రైళ్ల సంఖ్యను మరింత పెంచాలని కీలక సూచనలు చేస్తున్నారు.