దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులను చేస్తుంది. అయితే కేంద్రం నిబంధనలలో ఎన్ని మార్పులు చేస్తున్నా కొందరు మాత్రం అక్రమంగా రేషన్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొందరు అక్రమంగా రేషన్ పొందుతున్నారు.
కేంద్రం ఇప్పటికే అక్రమంగా రేషన్ పొందుతున్న 4.4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేయగా మరి కొంతమంది రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేషన్ కార్డుల ద్వారా అక్రమాలకు తావివ్వకూడదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రద్దు చేసిన రేషన్ కార్డులలో అర్హులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
కేంద్రం ఇప్పటికే మరణించిన వారి రేషన్ కార్డులను తొలగించడంతో పాటు నకిలీ కార్డులు పొందిన వారికి డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా రేషన్ అందకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఎవరైనా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోతే ఈ నెల 30వ తేదీలోగా అనుసంధానం చేయాలి. అలా అప్ డేట్ చేయని వాళ్లు రేషన్ కోల్పోయే లేదా రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.
అందువల్ల రేషన్ కార్డు వినియోగదారులు తప్ప్నిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలను తెచ్చుకుని ఇబ్బంది పడే బదులు ముందుగానే రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసి జాగ్రత్త పడితే మంచిది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…