Tag Archives: NV Prasad

Chiranjeevi: చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి అమ్ముడుపోలేదు.. అప్పుల పాలయ్యారు: ఎన్వీ ప్రసాద్

Chiranjeevi:ఆచార్య సినిమా వంటి ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రబృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి పొలిటికల్ జర్నీలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి ఈయన మాట్లాడారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన 2009వ సంవత్సరంలో ఎన్నికల బరిలోకి దిగారు మొదటిసారి ఎన్నికలలో పాల్గొన్నప్పటికీ ఈయన ఏకంగా 18 స్థానాలలో గెలుపు సాధించారు.

ఇకపోతే 2011 వ సంవత్సరంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.ఇలా కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయటం వల్ల చిరంజీవి గురించి చాలా మంది ఎన్నో విమర్శలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, భారీ మొత్తంలో డబ్బు తీసుకొని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని ఆయన గురించి విమర్శలు చేశారు. కానీ చిరంజీవి డబ్బులకు అమ్ముడు పోలేదని
ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు.

 

Chiranjeevi: చిరంజీవి ఆస్తులు అమ్మి అప్పులు తీర్చారు..

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన తర్వాత జరిగిన సంఘటన గురించి ఈయన చెబుతూ..మద్రాసు ప్రసాద్ ల్యాబ్ పక్కనుండే కృష్ణానగర్ గార్డెన్ ప్రాపర్టీ అమ్మి, ప్రజారాజ్యం పార్టీ అమ్మేముందు తన అప్పులన్నీ తీర్చాలని ఈ సందర్భంగా ప్రసాద్ వెల్లడించారు. అయితే చిరంజీవి గురించి ఎంతోమంది ఎన్నో మాటలు అన్న ఆయన ఏ మాత్రం నోరు విప్పలేదు కానీ చిరంజీవి గారిని ఎవరైనా, ఏమైనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం ఊరుకోరని ప్రసాద్ తెలిపారు. ఈ విధంగా ప్రజారాజ్యం బాధ నుంచి పుట్టినదే జనసేన అంటూ ఎన్వీ ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nayanathara: నయనతార రెమ్యూనరేషన్ విషయంలో అలా ప్రవర్తించారా.. అసలు విషయం చెప్పిన ప్రొడ్యూసర్?

Nayanathara:నయనతార లేడీ సూపర్ స్టార్ గా గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. ఇలా చెల్లెలి పాత్రలో నటించిన నయనతార ఈ సినిమా కోసం ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి ఎన్వి ప్రసాద్ నయనతార గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవితో తాను ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను అయితే గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఆకల నెరవేరిందని తెలిపారు. ఇక ఈ సినిమాలో నయనతార గురించి ఈయన మాట్లాడుతూ ఆమె.. చివరి రోజు షెడ్యూల్లో భాగంగా చెన్నై నుంచి వచ్చి కేవలం గంట వ్యవధిలోనే తన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని తెలిపారు.

Nayanathara: నయనతార క్రమశిక్షణ నాకు నచ్చింది..

ఇక సినిమా షూటింగ్ పూర్తి అయిపోయినప్పటికీ తన రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ ఉన్న తాను ఏమాత్రం రెమ్యూనరేషన్ గురించి అడగలేదని తను మాత్రమే కాకుండా తన టీం కూడా ఎవరు తన రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ అడగలేదని ఈయన తెలిపారు. షూటింగ్ విషయంలో నయనతార ప్రవర్తన, క్రమశిక్షణ తనకు ఎంతో బాగా నచ్చాయని ఈ సందర్భంగా ఎన్ వి ప్రసాద్ నయనతార పై ప్రశంసల కురిపించారు. అయితే తర్వాత తామే నయనతారకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేశామని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.