Nayanathara:నయనతార లేడీ సూపర్ స్టార్ గా గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే తాజాగా ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. ఇలా చెల్లెలి పాత్రలో నటించిన నయనతార ఈ సినిమా కోసం ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి ఎన్వి ప్రసాద్ నయనతార గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవితో తాను ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను అయితే గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఆకల నెరవేరిందని తెలిపారు. ఇక ఈ సినిమాలో నయనతార గురించి ఈయన మాట్లాడుతూ ఆమె.. చివరి రోజు షెడ్యూల్లో భాగంగా చెన్నై నుంచి వచ్చి కేవలం గంట వ్యవధిలోనే తన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని తెలిపారు.
ఇక సినిమా షూటింగ్ పూర్తి అయిపోయినప్పటికీ తన రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ ఉన్న తాను ఏమాత్రం రెమ్యూనరేషన్ గురించి అడగలేదని తను మాత్రమే కాకుండా తన టీం కూడా ఎవరు తన రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ అడగలేదని ఈయన తెలిపారు. షూటింగ్ విషయంలో నయనతార ప్రవర్తన, క్రమశిక్షణ తనకు ఎంతో బాగా నచ్చాయని ఈ సందర్భంగా ఎన్ వి ప్రసాద్ నయనతార పై ప్రశంసల కురిపించారు. అయితే తర్వాత తామే నయనతారకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేశామని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…