Tag Archives: orders

Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

Medical: కరోనా కాలంలో మెడికల్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిలో ధరలకు మందులను అమ్మింది. జనాల భయాలనే ఆసరా చేసుకుని అందినకాడికి దోచుకుంది. గతంతో పోలిస్తే మల్టీ విటమిన్, సీ విటమిన్, డీ విటమిన్ లకు ధరలు అమాంతం పెంచేసింది. ఒకానొక సమయంలో మెడికల్ షాపుల్లో ఈ మందులు కూడా లభించని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. 

Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

ఇదిలా ఉంటే మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. గల్లీకో షాపు అన్న రీతిలో మెడికల్ దందా కొనసాగుతోంది. కనీసం అనుభవం లేని వ్యక్తులు మెడికల్ షాపులను నడుపుతున్నారు. వీటిపై నిఘా లేదు. దీంతో ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. 

Medical: అడ్డగోలు మెడికల్ విక్రయాలు కుదరదు..! అవి తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు..!

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర జౌషధ నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మాసిస్టులు లేకుండా మెడికల్ షాపులను నడిపితే ఇకపై సీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు అందాయి. కనీసం నెలకు 25 షాపులను తనిఖీలు చేసే విధంగా ఆదేశాలు అందాయి. నివేదికలను యాప్ ద్వారా డీసీఏ డైరెక్టర్ కు పంపాలని ఆదేశించాయి. 

ఇన్స్పెక్టర్లకు తెలిసే జరగుతుందనే ఆరోపణలు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఫార్మాసిస్టుల లేకుండానే మెజారిటీ మెడికల్ షాపులను నిర్వాహకులు నడిపిస్తున్నారు. వేరే వ్యక్తుల ఫార్మసీ డిగ్రీ సర్టిఫికేట్లు పెట్టుకుని వారి పేరుపై వేరే వారు దందా చేసుకుంటున్నారు. ఇందుకు సదరు డిగ్రీ చేసిన వ్యక్తులకు నెలకు ఇంత అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా స్థానికంగా ఉండే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తెలిసే జరగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ఇక ధరల విషయం దేవుడికే ఎరుక. వారంత ధర చెల్లించి మందుల్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు.

మోదీ సర్కార్ ఆదేశాలు.. అక్కడ నవంబర్ 30 వరకు లాక్ డౌన్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర హోం శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అమలవుతున్నా నిబంధనలను మాత్రం కేంద్రం సడలించింది.

ఎలాంటి అనుమతులు అవసరం లేకుం్దానే సరుకు రవాణా చేసుకోవచ్చని, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. గత నెల 30వ తేదీన వాణిజ్య సంస్థల రీ ఓపెనింగ్ విశయంలో అన్ లాక్ 5 నిబంధనలు విడుదలయ్యాయని.. అవే నిబంధనలను నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఫలితంగా కంటైన్మెంట్ జోన్ల ప్రజలు మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడక తప్పదు.

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు మాత్రమే ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కేంద్రం కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను భారీగా తగ్గించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలోనే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అధికారులు లాక్ డౌన్ అమలవుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం శాఖ తెలిపింది.

మరోఅవైపు దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీనపడుతోంది. గత నెలలో నమోదైన కేసులతో పోలిస్తే కేసుల సంఖ్య సగానికి తగ్గింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి పరిస్థితి కొనసాగితే కరోనా వ్యాక్సిన్ లేకుండానే మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.