Tag Archives: otp

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఓటిపీ చెబితేనే రేషన్ పంపిణీ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేరే విధంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ త్వరలో రేషన్ ఇంటికి పంపిణీ చేసే విధంగా సరికొత్త విధానం అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తే సరుకులు ఇంటికి చేరతాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరగగా 2021 సంవత్సరం జనవరి 1 నుంచి వాహనాల ద్వారా రేషన్ ను సరఫరా చేయనున్నారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకులను వాలంటీర్లు వాళ్లకు కేటాయించిన ఇళ్లకు పంపిణీ చేస్తారు. అయితే రేషన్ పొందాలంటే రేషన్ కార్డు లబ్ధిదారుడు కార్డుతో మొబైల్ నంబర్ ను లింక్ చేసుకొని ఉండాలి.

రేషన్ తీసుకునే సమయంలో మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా వాలంటీర్లు సీరియల్ నంబర్ ప్రకారం రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నారు. 2021 సంవత్సరం జనవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ప్రతి రేషన్ కార్డుదారుడి మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు నమోదు చేస్తే మాత్రమే సరుకుల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. నూతన విధానం ద్వారా రేషన్ లో అక్రమాలను సులభంగా అరికట్టవచ్చు.

జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితం నుంచే ఈ విధానం అమలు కోసం ప్రయత్నాలు చేయగా వివిధ కారణాల వల్ల ఈ విధానం అమలు వాయిదా పడుతూ వస్తోంది. జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నూతన నిర్ణయాలను, విధానాలను అమలులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం.

సిమ్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఇకపై సులభంగా పొందే ఛాన్స్..?

సాధారణంగా సిమ్ కార్డును కొనుగోలు చేయాలంటే ఉండే ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఒరిజినల్ ఆధార్ కార్డుతో వెరిఫికేషన్ కు హాజరైతే మాత్రమే సిమ్ కార్డును జారీ చేస్తున్నారు. అయితే కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొనిరావడానికి సిద్ధమవుతోంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ఎవరైనా ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారాలంటే సులభంగా మారిపోవచ్చు. ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సులభంగా సిమ్ కార్డును ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు అమలు కానున్నాయని ఈ నిబంధన అమలులోకి వస్తే కొత్తగా అప్లికేషన్ ఫామ్ ను సమర్పించాల్సిన అవసరం సైతం ఉండదని కేంద్రం చెబుతోంది.

ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారిన వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్ లో చిరునామాకు సంబంధించిన ప్రూఫ్ ను సబ్మిట్ చేస్తే ఆ అడ్రస్ కు కంపెనీ బిల్ పంపుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తోంది. దేశంలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లతో పోలిస్తే ప్రీ పెయిడ్ కస్టమర్ల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది.

ఎవరైనా ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కు మారాలంటే మళ్లీ వెరిఫికేషన్ ను పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో చాలామంది పోస్ట్ పెయిడ్ లోకి మారడానికి ఆసక్తి చూపుతున్నారు. టెలికం డిపార్ట్‌మెంట్ నూతన విధానం ద్వారా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది.

గ్యాస్ సిలిండర్ బుక్ చేసున్నారా… అమల్లోకి 4 కొత్త నిబంధనలు..?

దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగానే నిబంధనల్లో సైతం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ విషయంలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నూతన నిబంధనల గురించి తెలుసుకోని వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నేటి నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెబుతారో వాళ్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ ను పొందగలగుతారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అడ్రస్ మారినా గ్యాస్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మారినా వీలైనంత త్వరగా అప్ డేట్ చేయించుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే గ్యాస్ వినియోగదారులకు ఈ మేరకు సూచనలు చేస్తున్నాయి.

ఇండేన్ గ్యాస్ ను వినియోగించే వినియోగదారులకు బుకింగ్ నంబర్ మారింది. పాత బుకింగ్ నంబర్ కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే గ్యాస్ బుకింగ్ కాదు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7718955555 కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో గ్యాస్ బుకింగ్ కు ఒక్కో సర్కిల్ లో ఒక్కో నంబర్ ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ కు ఒకే నంబర్ ఉంది.

ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో తగ్గిందో తెలుసుకుంటే సిలిండర్ డెలివరీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకోవడం వల్ల గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు కలగవు.