దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగానే నిబంధనల్లో సైతం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ విషయంలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నూతన నిబంధనల గురించి తెలుసుకోని వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నేటి నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే వన్ టైమ్ పాస్ వర్డ్ ను చెబుతారో వాళ్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ ను పొందగలగుతారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అడ్రస్ మారినా గ్యాస్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మారినా వీలైనంత త్వరగా అప్ డేట్ చేయించుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే గ్యాస్ వినియోగదారులకు ఈ మేరకు సూచనలు చేస్తున్నాయి.
ఇండేన్ గ్యాస్ ను వినియోగించే వినియోగదారులకు బుకింగ్ నంబర్ మారింది. పాత బుకింగ్ నంబర్ కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే గ్యాస్ బుకింగ్ కాదు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7718955555 కు కాల్ చేసి గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో గ్యాస్ బుకింగ్ కు ఒక్కో సర్కిల్ లో ఒక్కో నంబర్ ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ కు ఒకే నంబర్ ఉంది.
ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో తగ్గిందో తెలుసుకుంటే సిలిండర్ డెలివరీ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకోవడం వల్ల గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఇబ్బందులు కలగవు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…