కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం రుణ గ్రహీతలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు వడ్డీపై వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..? కేంద్రం కొన్ని రుణాలకు మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేస్తోంది. పర్సనల్ లోన్, ప్రొఫెషనల్స్ అండ్ కన్షప్షన్ లోన్, హౌసింగ్ లోన్, కన్సూమర్ డ్యూరబుల్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.
కొన్ని రకాల రుణాలు తీసుకున్న వాళ్లకు మాత్రం కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీ ప్రయోజనాలను అందించడం లేదు. క్రాప్ లోన్, ట్రాక్టర్ లోన్స్ తో పాటు వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత రుణాలకు కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేయడం లేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా చేసిన కేంద్రం రైతులను మాత్రం విస్మరించడం గమనార్హం.
కేంద్రం వ్యవసాయ రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీ చేయకపోవడం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2కోట్ల రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఎక్స్గ్రేషియా స్కీమ్ డబ్బులు అర్హులకు నేరుగా బ్య్ంక్ ఖాతాలలో జమవుతాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…