కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం రుణ గ్రహీతలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు వడ్డీపై వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..? కేంద్రం కొన్ని రుణాలకు మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేస్తోంది. పర్సనల్ లోన్, ప్రొఫెషనల్స్ అండ్ కన్షప్షన్ లోన్, హౌసింగ్ లోన్, కన్సూమర్ డ్యూరబుల్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.
కొన్ని రకాల రుణాలు తీసుకున్న వాళ్లకు మాత్రం కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీ ప్రయోజనాలను అందించడం లేదు. క్రాప్ లోన్, ట్రాక్టర్ లోన్స్ తో పాటు వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత రుణాలకు కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేయడం లేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా చేసిన కేంద్రం రైతులను మాత్రం విస్మరించడం గమనార్హం.
కేంద్రం వ్యవసాయ రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీ చేయకపోవడం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2కోట్ల రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఎక్స్గ్రేషియా స్కీమ్ డబ్బులు అర్హులకు నేరుగా బ్య్ంక్ ఖాతాలలో జమవుతాయి.
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…