"Jobs" on wooden block and magnifying glass on newspaper background
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 90 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరోగ్య మిత్ర, టీం లీడర్స్ పోస్టులను జగన్ సర్కార్ భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 62 ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 55, టీం లీడర్స్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 15 ఉద్యోగాలు ఉండగా ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 14, టీం లీడర్స్ ఉద్యోగం ఒకటి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 13 ఉద్యోగాలు ఉండగా అందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 12 ఉండగా టీం లీడర్స్ ఉద్యోగాలు ఒకటి ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా జిల్లాల వెబ్ సైట్ లను చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.
కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://krishna.ap.gov.in/, https://srikakulam.ap.gov.in/, https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
విద్యార్హత, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎమ్మెస్సీ (నర్సింగ్), ఎంఫార్మసీ, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ (ఎంఎల్టీ), బీఫార్మసీ, ఫార్మసీ డీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై విద్యార్థులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…