మనలో చాలామందిని నిద్రపోయిన సమయంలో వచ్చే పీడకలలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొందరు ఆ పీడకలలను తలచుకుని భయాందోళనకు గురవుతూ ఉంటారు. నిద్ర లేచిన తరువాత సైతం ఆ పీడకలలు చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. కొందరు వేటి గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారో అవే పీడకలల రూపంలో వస్తూ ఉంటాయి. కొందరికి ఆ పీడకలల వల్ల ప్రశాంతత కూడా ఉండదు.
తమకు వచ్చిన పీడకలలను అవతలి వ్యక్తులను చెబితే ఏమనుకుంటారో చాలామంది అలా చెప్పడానికి సైతం ఇష్టపడరు. ఈ పీడకలల వల్ల కొందరిలో ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. వీళ్లు ఎక్కువగా ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. ఒక సంస్థ 351 మంది పెద్దలపై పీడకలల గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
వీళ్లలో 2 నుంచి 8 శాతంమంది పీడకలలు తమను నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశాయని చెప్పగా మరి కొందరికి ఏదో చెడుశక్తి వెంటాడుతుందన్న భావన కలిగిస్తుందని వెల్లడించారు. పీడకలల వల్ల కొందరు ఆర్ఈఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కలలు రావడానికి సరైన కారణాలు తెలియవని.. పీడకలల వల్ల చాలామంది డిప్రెషన్ బారిన పడుతున్నారని తెలిపారు.
పీడకలలు తరచూ వస్తుంటే వైద్యులను సంప్రదించి సకాలంలో వైద్య చికిత్స చేయించుకోవడం మంచిదని తెలుపుతున్నారు. మీకు కూడా తరచూ పీడకలలు వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…