ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేరే విధంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ త్వరలో రేషన్ ఇంటికి పంపిణీ చేసే విధంగా సరికొత్త విధానం అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తే సరుకులు ఇంటికి చేరతాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరగగా 2021 సంవత్సరం జనవరి 1 నుంచి వాహనాల ద్వారా రేషన్ ను సరఫరా చేయనున్నారు. ఎంఎల్ఎస్పీ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకులను వాలంటీర్లు వాళ్లకు కేటాయించిన ఇళ్లకు పంపిణీ చేస్తారు. అయితే రేషన్ పొందాలంటే రేషన్ కార్డు లబ్ధిదారుడు కార్డుతో మొబైల్ నంబర్ ను లింక్ చేసుకొని ఉండాలి.
రేషన్ తీసుకునే సమయంలో మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా వాలంటీర్లు సీరియల్ నంబర్ ప్రకారం రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నారు. 2021 సంవత్సరం జనవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ప్రతి రేషన్ కార్డుదారుడి మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు నమోదు చేస్తే మాత్రమే సరుకుల పంపిణీ జరగనుందని తెలుస్తోంది. నూతన విధానం ద్వారా రేషన్ లో అక్రమాలను సులభంగా అరికట్టవచ్చు.
జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితం నుంచే ఈ విధానం అమలు కోసం ప్రయత్నాలు చేయగా వివిధ కారణాల వల్ల ఈ విధానం అమలు వాయిదా పడుతూ వస్తోంది. జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నూతన నిర్ణయాలను, విధానాలను అమలులోకి తీసుకొస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…