పెళ్లి కోసం కొందరు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అన్నం తినకుండా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ బెదిరిస్తూ ఉండటం మనం చూసి ఉంటాం. కానీ పెళ్లి కోసం తనతల్లి పై అలిగి ఏకంగాహోర్డింగ్ ఎక్కి బెదిరించిన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ ఇండర్లో చోటు చేసుకుంది. ఓ టీనేజర్ పారదేశీపురలో ఉన్న బండారీ బ్రిడ్జి వంతెనపై గల భారీ హోర్డింగ్ ఎక్కి ఫోన్ చూసుకుంటే కనిపించింది. దీంతో ఆమెను చూసిన అందరూ ఆత్మహత్య చేసుకోవడానికి పైకెక్కింది భావించారు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఎంచక్కా హోర్డింగ్ పై కూర్చుని ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ ఉండటంతో సిగ్నల్స్ కోసం అంత పైకి ఎక్కిందా అని కొందరు కామెంట్ చేసుకున్నారు.
కానీ కొద్ది సమయానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి రావడంతో ఏదో ప్రేమవ్యవహారం అనుకున్నారు. కానీ ఆ అంచనాలు కూడా కాదని ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం తన తల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ ఎక్కి బెదిరిస్తుందని తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనింకా మైనర్ అయినప్పటికీ ఒక అబ్బాయిని ప్రేమించి పీకల్లోతులో ప్రేమలో మునిగి పోయింది. ఈ విషయం తన తల్లితో చెప్పి తన పెళ్లి చేయాల్సిందిగా అడగడంతో అందుకు తన తల్లి మందలించి బుద్ధిగా చదువుకోమని చెప్పింది. దీంతో ఆబాలిక తనతల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ బోర్డ్ ఎక్కినిరసన తెలియజేసింది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను కిందికి దిగి రావాల్సిందిగా కోరారు. కానీ ఆమె తన పెళ్ళికి తన తల్లి ఒప్పుకుంటేనే కిందికి దిగి వస్తానని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అతను ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కిందికి దిగమని తన బాయ్ ఫ్రెండ్ ఎంత బతిమిలాడినా ఆమె దిగకపోవడంతో పోలీసులు కలుగజేసుకొని మీ పెద్ద వారితో మాట్లాడుతాము కిందికి దిగమని సూచించడంతో ఆమె కిందికి దిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన సదరు నెటిజన్లు పిల్లలను సరైన క్రమశిక్షణలో పెరగకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కామెంట్ చేస్తున్నారు.
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…