Tag Archives: oxygen shortage

అమ్మను బతికించుకోవాలనే ఆరాటంలో.. కూతురు చేసిన పని తెలిస్తే షాక్?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.అదే విధంగా ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రులకు వెళ్ళగా ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్ సౌకర్యం లేక ప్రాణాలు వదులుతున్నారు.ఆస్పత్రిలో చేరిన కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక వారిని బతికించుకోవడం కోసం కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

తాజాగా ఓ మహిళ ఆక్సిజన్ అందక కొనఊపిరితో బాధ పడుతున్న సమయంలో తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలి అనే ఆరాటంతో ఆ కూతురు తన తల్లికి నోటి ద్వారా ఆక్సిజన్ అందించిన ఘటన ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మందిని కలిచి వేసింది.

కరోనాతో బాధపడుతున్న ఆ తల్లిని తన ఇద్దరు కూతుర్లు కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆ మహిళకు ఊపిరి తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా మారిపోయింది.ఈ క్రమంలోనే ఎలాగైనా తన తల్లిని బతికించుకోవాలనే ఆరాటంతో ఆ కూతురు ఏకంగా కరోనా సోకిన తన తల్లి నోట్లోకి తన నోటి ద్వారా ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆ తల్లి మరణించింది.

ఈ సన్నివేశం చూసిన అక్కడ వారు ఎంతో చలించిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే తరహాలోనే గత కొద్ది రోజుల క్రితం భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నోటి ద్వారా ఆక్సిజన్ అందించినప్పటికీ భర్త కూడా మృత్యువాత పడ్డాడు. తాజా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు గత 24 గంటల్లో
3,92,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో 3,673 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఆక్సిజన్, వ్యాక్సినేషన్ పై అసలు ప్లాన్ ఉందా అంటూ కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం కోర్టు!

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరమవుతుంది.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అధికమవడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ , పడకలకొరత ఏర్పడుతోంది. ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణం బారిన పడుతున్నారు. ఈ విధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే బుధవారంనాటి పలు విచారణ ఈ సందర్భంగా కేంద్రానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేస్తూ నిలదీశారు.పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతుంటే మీరు పరిశ్రమల పట్ల ఆందోళన చెందుతున్నారు. మనుషుల జీవితాలు అంటే ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను గత 24 గంటల్లో ఏం చేశారని ధర్మాసనం డిమాండ్ చేసింది. అసలు ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఉందా అంటూ హైకోర్టు నిలదీసింది. ఆస్పత్రులకు కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత పూర్తి కేంద్రానిదేనని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వైద్య అవసరాల కోసం పరిశ్రమల నుంచి ఆక్సిజన్ వైద్య రంగం వైపు మళ్ళించాలని పేర్కొంది. దేశం మొత్తం ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఎలాగైనా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి లేదా దొంగతనం చేసి అయినా తమ బాధ్యత నెరవేర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది