దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.అదే విధంగా ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రులకు వెళ్ళగా ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్ సౌకర్యం లేక ప్రాణాలు వదులుతున్నారు.ఆస్పత్రిలో చేరిన కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక వారిని బతికించుకోవడం కోసం కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజాగా ఓ మహిళ ఆక్సిజన్ అందక కొనఊపిరితో బాధ పడుతున్న సమయంలో తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలి అనే ఆరాటంతో ఆ కూతురు తన తల్లికి నోటి ద్వారా ఆక్సిజన్ అందించిన ఘటన ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మందిని కలిచి వేసింది.
కరోనాతో బాధపడుతున్న ఆ తల్లిని తన ఇద్దరు కూతుర్లు కలిసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆ మహిళకు ఊపిరి తీసుకోవడం ఎంతో ఇబ్బందిగా మారిపోయింది.ఈ క్రమంలోనే ఎలాగైనా తన తల్లిని బతికించుకోవాలనే ఆరాటంతో ఆ కూతురు ఏకంగా కరోనా సోకిన తన తల్లి నోట్లోకి తన నోటి ద్వారా ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆ తల్లి మరణించింది.
ఈ సన్నివేశం చూసిన అక్కడ వారు ఎంతో చలించిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే తరహాలోనే గత కొద్ది రోజుల క్రితం భర్తను కాపాడుకోవడం కోసం భార్య తన నోటి ద్వారా ఆక్సిజన్ అందించినప్పటికీ భర్త కూడా మృత్యువాత పడ్డాడు. తాజా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు గత 24 గంటల్లో
3,92,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 3,673 మంది మరణించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…