దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరమవుతుంది.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అధికమవడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ , పడకలకొరత ఏర్పడుతోంది. ఎంతోమంది సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణం బారిన పడుతున్నారు. ఈ విధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే బుధవారంనాటి పలు విచారణ ఈ సందర్భంగా కేంద్రానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేస్తూ నిలదీశారు.పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతుంటే మీరు పరిశ్రమల పట్ల ఆందోళన చెందుతున్నారు. మనుషుల జీవితాలు అంటే ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే మంగళవారం హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను గత 24 గంటల్లో ఏం చేశారని ధర్మాసనం డిమాండ్ చేసింది. అసలు ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఉందా అంటూ హైకోర్టు నిలదీసింది. ఆస్పత్రులకు కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యత పూర్తి కేంద్రానిదేనని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వైద్య అవసరాల కోసం పరిశ్రమల నుంచి ఆక్సిజన్ వైద్య రంగం వైపు మళ్ళించాలని పేర్కొంది. దేశం మొత్తం ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఎలాగైనా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి లేదా దొంగతనం చేసి అయినా తమ బాధ్యత నెరవేర్చాలని హైకోర్టు స్పష్టం చేసింది
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…