Tag Archives: Pallavi Gowda

ప్రముఖ సీరియల్ నటి పల్లవిని.. ఆ పని చేసినందుకు బ్యాన్ చేశారట..

పల్లవి గౌడ ప్రముఖ తెలుగు సీరియల్ నటి. ఆమె 1993 లో సెప్టెంబర్ లో కర్ణాటకలో జన్మించారు. మొదట ఆమె 2010 సంత్సరంలో ‘మనే ఒండు మూర్’ ఈటీవీ కన్నడలో ప్రసారం అయిన సీరియల్ లో నటించారు. అప్పటి నుంచి ఆమె బుల్లితెర ప్రస్థానం మొదలైంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. 2011 నుంచి 2014 వరకు ప్రసారం అయిన ‘పసుపు కుంకుమ’ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు.

తర్వాత 2014 లోనే సావిత్రి అనే సీరియల్ లో కూడా ఆమె నటించారు. తర్వాత తెలుగుకు మళ్లీ దూరం అయి కన్నడం, మళయాలంలో ఎన్నో రకాల సీరియల్స్ ను చేసింది. ప్రస్తుతం పల్లవి.. తెలుగులో రెండు సీరియల్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి చదరంగం.. మరొకటి సూర్యాకాంతం. చదరంగంలో కొంచెం నెగెటీవ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆమెను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో బ్యాన్ చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే.. సావిత్రి సీరియల్ లో నటించే క్రమంలో అప్పుడు మరే సీరియల్ నటించనని అగ్రిమెంట్ తీసుకున్నారట. ఆమె కూడా దానికి ఒప్పుకొని సంతకం కూడా చేసింది.

కానీ వాళ్లు అదే అదునుగా భావించి చేసిన పనికి కనీసం పేమెంట్ ఇవ్వకుండా తిప్పారని.. అందుకే తాను మరో సీరియల్ చేయడానికి చేసేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందకు ఆమెపై బ్యాన్ విధించినట్లు ఆమె చెప్పారు. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో ఆమె చదరంగం, సూర్యాకాంతం అనే సీరియల్స్ లో నటిస్తోంది.