Tag Archives: pensioners

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్.. రూల్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందేందుకు దీనికి అర్హులు కానున్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ నియమనిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందొచ్చు. ఇందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది.

అయితే ఈ పెన్షన్ రూ. 45 వేలు వరకు మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం దాని లిమిట్ ను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి నుంచి ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ తెలిపింది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నియమనిబంధనల మేరకు గరిష్టంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందొచ్చు.

ఈ మేరకు కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ముఖ్యమైన కొత్త రూల్స్‌ తీసుకొచ్చామని పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ ప్రకటించింది. వీటికి డీఆర్ సమయానుగుణంగా జతవుతుంది. అలాగే నెలకు కనిష్టం మొత్తంగా రూ.9 వేల పెన్షన్ అందుకోవచ్చు. దీనికి కూడా డీఆర్ అదనంగా జతవుతుంది.

పెన్షన్ తీసుకునే వాళ్లకు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..?


గత కొన్ని నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.

కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం కూడా తగ్గిన నేపథ్యంలో కేంద్రం గతంలో ఈ సంవత్సరం డీఏ పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గడం పరిస్థితుల మార్పు నేపథ్యంలో డీఏ పెంపు అమలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెరగనుందని సమాచారం.

2021 సంవత్సరం జులై నుంచి డీఏ పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే కేంద్రం ఈ విషయం గురించి స్పందించకపోవడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తే దేశంలోని 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు పాత డీఏనే లభిస్తోంది.

అయితే ఈ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డీఏ పెంపు గురించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది.