గత కొన్ని నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.
కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం కూడా తగ్గిన నేపథ్యంలో కేంద్రం గతంలో ఈ సంవత్సరం డీఏ పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గడం పరిస్థితుల మార్పు నేపథ్యంలో డీఏ పెంపు అమలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెరగనుందని సమాచారం.
2021 సంవత్సరం జులై నుంచి డీఏ పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే కేంద్రం ఈ విషయం గురించి స్పందించకపోవడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తే దేశంలోని 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు పాత డీఏనే లభిస్తోంది.
అయితే ఈ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డీఏ పెంపు గురించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…