Tag Archives: per month

రూ.లక్ష పెట్టుబడితో నెలకు రూ.40,000 ఆదాయం.. ఏం బిజినెస్ అంటే..?

మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఏ బిజినెస్ చేయాలి..? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎలా డబ్బు సంపాదించాలి..? అనే విషయాలపై అవగాహన ఉండదు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఈ సీజన్ ఆ సీజన్ అనే తేడాల్లేకుండా బిస్కెట్లకు అన్ని సీజన్లలోనూ డిమాండ్ ఉంటుంది. రుచికరమైన బిస్కెట్లను తయారు చేస్తే చాలు లాభాలు ఖచ్చితంగా వస్తాయి.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ బిస్కెట్లను ఇష్టపడతారు. బిస్కెట్ల తయారీ బిజినెస్ లో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ బిజినెస్ కు పెట్టుబడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ల ద్వారా సులభంగా రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. ముద్రా స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు చేసేవాళ్ల కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది. దాదాపు 5 లక్షల రూపాయలు ఈ బిజినెస్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ 5 లక్షలలో మూడు నుంచి 4 లక్షల రూపాయలు బిస్కెట్లను తయారు చేసే మెషీన్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 90 శాతం వర్కింగ్ క్యాపిటల్ లోన్ బ్యాంక్ నుంచి లభిస్తుంది కాబట్టి లక్ష రూపాయలు సొంతంగా పెట్టుబడి పెడితే సులువుగా బిస్కెట్ల తయారీ ప్లాంట్ ను ప్రారంభించవచ్చు. మెషిన్ల కొనుగోలు పోగా మిగిలిన మొత్తాన్ని ముడి పదార్థాలు, ప్యాకేజీ, పని చేసే వాళ్ల వేతనం కోసం ఖర్చు చేయాలి.

బిస్కెట్ తయారీ ప్లాంట్ వ్యాపారం ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు 40,000 రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయలకు అటూఇటుగా ఆదాయం చేకూరుతుంది.

డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5 వేలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

దేశంలో చాలామంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదవటానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సహించేందుకు పలు సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలు ఫెలోషిప్స్ ను అందజేస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (kvpy) ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది.

కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపికైన విద్యార్థులకు ఫెలోషిప్స్ ను అందిస్తుంది. http://kvpy.iisc.ernet.in వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 30 వరకు విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వేల సంఖ్యలో విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.

గతంలో తక్కువ రోజులే దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా తాజాగా ఆ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఈ ఫెలోషిప్ కు అర్హత పొందడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. http://kvpy.iisc.ernet.in/ వెబ్ సైట్ లో ఈ ఫెలోషిప్ కు సంబంధించిన అర్హత ప్రకటన ఉంటుంది. ఈ అర్హత ప్రకటన చదివి అర్హత ఉంటే మాత్రమే విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేయాలంటే అన్ని వివరాలను నమోదు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న వారు అర్హులు. 2021 జనవరి 31న ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు.