మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఏ బిజినెస్ చేయాలి..? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎలా డబ్బు సంపాదించాలి..? అనే విషయాలపై అవగాహన ఉండదు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఈ సీజన్ ఆ సీజన్ అనే తేడాల్లేకుండా బిస్కెట్లకు అన్ని సీజన్లలోనూ డిమాండ్ ఉంటుంది. రుచికరమైన బిస్కెట్లను తయారు చేస్తే చాలు లాభాలు ఖచ్చితంగా వస్తాయి.
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ బిస్కెట్లను ఇష్టపడతారు. బిస్కెట్ల తయారీ బిజినెస్ లో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ బిజినెస్ కు పెట్టుబడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ల ద్వారా సులభంగా రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. ముద్రా స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు చేసేవాళ్ల కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది. దాదాపు 5 లక్షల రూపాయలు ఈ బిజినెస్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఈ 5 లక్షలలో మూడు నుంచి 4 లక్షల రూపాయలు బిస్కెట్లను తయారు చేసే మెషీన్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 90 శాతం వర్కింగ్ క్యాపిటల్ లోన్ బ్యాంక్ నుంచి లభిస్తుంది కాబట్టి లక్ష రూపాయలు సొంతంగా పెట్టుబడి పెడితే సులువుగా బిస్కెట్ల తయారీ ప్లాంట్ ను ప్రారంభించవచ్చు. మెషిన్ల కొనుగోలు పోగా మిగిలిన మొత్తాన్ని ముడి పదార్థాలు, ప్యాకేజీ, పని చేసే వాళ్ల వేతనం కోసం ఖర్చు చేయాలి.
బిస్కెట్ తయారీ ప్లాంట్ వ్యాపారం ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు 40,000 రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయలకు అటూఇటుగా ఆదాయం చేకూరుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…