దేశంలో చాలామంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదవటానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సహించేందుకు పలు సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలు ఫెలోషిప్స్ ను అందజేస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (kvpy) ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
కేంద్రంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపికైన విద్యార్థులకు ఫెలోషిప్స్ ను అందిస్తుంది. http://kvpy.iisc.ernet.in వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 30 వరకు విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వేల సంఖ్యలో విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.
గతంలో తక్కువ రోజులే దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా తాజాగా ఆ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఈ ఫెలోషిప్ కు అర్హత పొందడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. http://kvpy.iisc.ernet.in/ వెబ్ సైట్ లో ఈ ఫెలోషిప్ కు సంబంధించిన అర్హత ప్రకటన ఉంటుంది. ఈ అర్హత ప్రకటన చదివి అర్హత ఉంటే మాత్రమే విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేయాలంటే అన్ని వివరాలను నమోదు చేయడంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న వారు అర్హులు. 2021 జనవరి 31న ఆన్లైన్ యాప్టిట్యూట్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…