దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పాల ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీటర్ పాల ధర 50 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఏపీలోని ఆ గ్రామాల్లో మాత్రం పాలు ఉచితంగా పోస్తారు. వినడానికి వింతగానే అనిపించినా దాదాపు 4 శతాబ్దాల నుంచి ఆ గ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఆ గ్రామాల్లో పాలకు డబ్బు ఇస్తామంటే మాత్రం చుక్క పాలు కూడా పోయరు.
అలా కాకుండా పాలు కావాలని అడిగితే ఇష్టంగా పోస్తారు. పాలు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు తమకు వద్దని ఆ డబ్బు వల్ల పాడైపోతామని గ్రామస్తులు చెబుతుండటం గమనార్హం. ఇలా పాలు ఉచితంగా పోసే వింత గ్రామాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలోని గంజహళ్లి, కడిమెట్ల గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. జిల్లాలోని గంజహళ్లిలో వందల సంఖ్యలో పశువులు ఉన్నాయి. ఆ పశువులు ఇచ్చే పాలలో ఇంటి అవసరాల మేరకు పాలను వినియోగించుకుని మిగిలిన పాలను ఇతరులకు ఇస్తారు.
కడిమెట్ల గ్రామంలో కూడా పాలు ఇతరులకు ఫ్రీగా ఇస్తారే తప్ప డబ్బులు తీసుకోరు. ఇలా ఈ రెండు గ్రామాల ప్రజలు పాలు అమ్మకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. 4 శతాబ్దాల క్రితం గంజహళ్లి గ్రామంలో పశువులు అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డాయి. కొన్ని పశువులు చనిపోయాయి. ఆ సమయంలో ఆ ఊరిలో ఉండే బడేసాబ్ తాత కొడుకు హుస్సేన్ సాహెబ్ ను పాలు తీసుకురావాలని ఊరిలోకి పంపించాడు.
అయితే పశువులకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో ఎవరూ పాలు పోయలేదు. దీంతో హుస్సేన్ సాహెబ్ చివరకు గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి పాలు కావాలని కోరగా గ్రామ పెద్ద తమ ఆవు చనిపోయిందని.. ఆవు కళేబరం మారెమ్మ ఆలయం దగ్గర పడేశామని చెప్పాడు. హుస్సేన్ సాహెబ్ ఆ గుడి దగ్గరకు వెళ్లి దేవతను ప్రార్థించగా చనిపోయిన ఆవు లేచి పాలు ఇచ్చింది. అనంతరం బడే సాబ్ గ్రామస్తులకు పాలు అమ్మకూడదని, పశుగ్రాసాన్ని తగులబెట్టకూడదని, పశువులను చంపకూడదని సూచించగా అదే ఆచారాన్ని నేటికీ గ్రామస్తులు అనుసరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…