Tag Archives: quarantine rules

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

Quarantine: విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా రిస్క్ ఉన్న దేశాలు తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కరోనా ఆంక్షలు, క్వారంటైన్ రూల్స్ ని సడలించింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రాకపోకలు కొనసాగించే వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం 14 స్వీయ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని తెలిపింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. నిరంతరం మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ ని పర్యవేక్షించాలనే అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు..

ఓమిక్రాన్ మొదలైనప్పటి నుంచి కొన్ని యూరోపియన్, ఆఫ్రికా దేశాలను హైరిస్క్ దేశాలుగా ప్రకటించింది. అక్కడి నుంచి వచ్చేవారిని నిశితంగా గమనించింది. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రయాణికులపై క్వారంటైన్ రూల్స్ విధించింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు ఊరట లభించింది.  కొత్తగా విధించిన మార్గదర్శకాల్లో విదేశీయులంతా తప్పనిసరిగా… 14 రోజుల ట్రావెల్ హిస్టరీని స్వీయ డిక్లరేషన్ ఫామ్ లో సమర్పించాలి. ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ పరీక్ష ఫలితాలను అప్ లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. సెల్ఫ్ డిక్లరేషణ్ ఫామ్ , నెగిటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ లైన్స్ బోర్డింగ్ కు అనుమతించనున్నారు.

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించాడు..18 నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలన్నింటిలో చిగురుటాకుల వణికిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి తీవ్రమైన కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై పలు చర్యలు తీసుకుంటున్నారు.ఒక వ్యక్తి జాగ్రత్తలు పాటించకుండా బయట తిరగడం వల్ల తాను కరోనా బారిన పడటమే కాకుండా ఈ వ్యాధి వ్యాప్తిని చేయడానికి కారకుడవుతాడు కనుక ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా కరోనా నిబంధనల విషయంలో ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కొందరు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టం చేయడంలో అన్ని దేశాల కన్నా వియత్నం ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి covid-19 నిబంధనలను ఉల్లంఘిచడంతో వియత్నాం ప్రభుత్వం అతనికి 18 నెలల జైలు శిక్షను అమలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. అధికార యంత్రాంగానికి ఆర్థిక నష్టాన్ని కలుగజేసినందుకుగాను సదరు వ్యక్తికి ఈ విధమైనటువంటి శిక్ష అమలు చేసినట్లు తెలిపారు.

డయో డుయి టంగ్ అనే యువకుడు కోవిడ్ నిబంధనలను అతిక్రమించి లావోస్ దేశం నుంచి టంగ్ ఏప్రిల్ 22న అక్రమంగా వియత్నాంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన ఆ యువకుడు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడు.

వైరస్ సోకిన ఆ వ్యక్తి వియత్నాంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కావడంతో అధికారులు అతనిని గుర్తించారు.టంగ్ చేసిన ఈ పనికి అధికార యంత్రాంగానికి సుమారుగా మూడు బిలియన్
డాంగ్‌లకు పైగా నష్టం వాటిల్లడంతో అతనికి ఏకంగా 18 నెలలు జైలు శిక్షను విధించారు.