Tag Archives: Rajasekhar Reddy

Actress pratyusha: ప్రత్యూష మరణం తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సహా అందరినీ కలిసా.. న్యాయం చేసింది ఆయన మాత్రమే : ప్రత్యూష తల్లి సరోజనీ దేవి

Actress pratyusha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె 2002లో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె పై అత్యాచారం చేసిన కారణంగానే మరణించిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యూష మరణం తర్వాత ఆమె తల్లి సరోజినీ దేవి తన కూతురికి న్యాయం జరగాలంటూ ఎంతో మందిని ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే తన కూతురుకు న్యాయం జరగాలని ఎంతో మంది పొలిటీషియన్లను ఈమె సంప్రదించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2002లో తన కూతురు చనిపోతే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసానని అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, కెసిఆర్ గారిని కూడా తాను కలిసానని ప్రత్యూష తల్లి వెల్లడించారు.

ఇలా తనకు న్యాయం జరగాలని ఎంతో మంది రాజకీయ నాయకులను కలిసినప్పటికీ తనకు మాత్రం కెసిఆర్ గారి సహాయం చేశారని ఈ సందర్భంగా సరోజినీ దేవి పేర్కొన్నారు.అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతోంది కేసీఆర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ పలు జిల్లాలలో పర్యటిస్తున్నారని అయితే తనకు ఫోన్ చేసి తనని కలవగా కేసీఆర్ గారు ఏకంగా తనని అసెంబ్లీకి తీసుకెళ్లి తనకు న్యాయం జరగాలంటూ వాదించారు.

Actress pratyusha: కెసిఆర్ సాయం చేశారు…


ఇక అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే వెంటనే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేసినట్లు ప్రత్యూష తల్లి ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఇలా కేసీఆర్ గారు కేసును సిబిఐ కి అప్పగించాలంటూ తన తరపున నిలబడ్డారని అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం ప్రమేయం లేకపోతే ఈ కేసు సిబిఐ కి అప్పగించి విచారణ జరిపించాలనీ రాజశేఖర్ రెడ్డి గారు కూడా తనకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేశారని ఈమె వెల్లడించారు. ఇలా కూతురు మరణం తర్వాత తాను డిప్రెషన్ లో ఉండగా కేసీఆర్ తనని పాప పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆ ఫౌండేషన్ రన్ చేస్తూ పదిమందిలో తన కూతురిని చూసుకుని తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాటం చేయమని చెప్పారంటూ ఈ సందర్భంగా ఫౌండేషన్ వెనుక ఉన్న కారణం కూడా వెల్లడించారు.

Nithiin: ఆ సినిమా చూసి వారం రోజులపాటు నిద్రపోలేదు… ఇప్పటికీ ఆ పాటకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు: నితిన్

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కృతి శెట్టి జంటగా ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించానని కానీ మాచర్ల నియోజకవర్గం సినిమాలో తాను ఒక ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఫుల్ ఎంత మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రమని నితిన్ తెలిపారు.డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇదివరకు ఎడిటర్ కావటం వల్ల ఈ సినిమాకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నారు. సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని వెల్లడించారు.

తాను ఇదివరకు నటించిన సినిమాలలో ఎన్నో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయని, ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అంటూ నితిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే సినిమాలు ఎప్పుడు ఒకే మూస దోరనిలో కాకుండా ఎంతో విభిన్నంగా తెరకెక్కించాలని అప్పుడే ప్రేక్షకుకు కూడా ఆ కొత్తదనం ఆస్వాదిస్తారని ఈయన తెలిపారు.

Nithiin: ఆ ఆలోచన తనకే వచ్చింది…

ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన విక్రమ్ సినిమా తనకు ఎంత బాగా నచ్చిందని ఆ సినిమా చూసి దాదాపు వారం రోజుల పాటు తనకు నిద్ర కూడా పట్టలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఇందులో ఏదైనా ఒక రీమిక్స్ సాంగ్ చేద్దామని ఆలోచన తనకు వచ్చిందని అందుకే తన కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రమైన జయం సినిమాలో రాను రాను అంటుందనే పాటను రీమిక్స్ చేశామని, ఈ సినిమా విడుదల అయ్యికొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ పాటకు ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈయన తెలిపారు.