Tag Archives: rajya sabha

RRR Movie: రాజ్యసభలో ఆస్కార్ అవార్డుల పై ప్రశంసల జల్లు.. తెలుగోడి దెబ్బకు దద్దరిల్లిన రాజ్యసభ!

RRR Movie: ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ కి ఒక ఆస్కార్ అవార్డు కూడా రాకపోగా ఈ ఏడాది మాత్రం ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో దేశం మొత్తం ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో కూడా ఈ అవార్డులపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు, అలాగే ది ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో భాగంగా నాటు నాటు పాటకగాను ఆస్కార్ గెలుచుకున్నటువంటి త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్ ధన్‌ఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈయన ఈ అవార్డు వేడుకల గురించి మాట్లాడుతూ నాటు నాటు అని ప్రస్తావించగానే ఒక్కసారిగా రాజ్యసభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇలా ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో ఈ విజయాలు
భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్‌ గుర్తింపు అంటూ ప్రశంసించారు.

RRR Movie: తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం ..


ఇలా రాజ్యసభలో ఆస్కార్ వేడుకల గురించి మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆస్కార్ వంటి గొప్ప అవార్డును తెలుగు చిత్ర పరిశ్రమ అందుకోవడంతో ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని, ముందు ముందు ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డులను మరెన్నో అందుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

Budget Session: పార్లమెంట్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా విమర్శించారు. 

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తమ విభజన డిమాండ్ల సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

రాజ్యసభలో జీరో అవర్ లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలంటూ.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవతున్నా… కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి, గిరిజన యూనివర్సీటీని ఏర్పాటు చేయలేదని కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.


విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని ..

మరోవైపు ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్ట్ కేసులతో ఒక పరీక్ష మూడేళ్ల పాటు నడుస్తోందని… దీని వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.