Tag Archives: Restaurants

Actress Sadha: ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు… ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సదా!

Actress Sadha:జయం సినిమాలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ ఒక డైలాగుతో ఎంతో ఫేమస్ అయ్యారు నటి సదా.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అవకాశాలను అందుకొని హీరోయిన్ గా ఎంతో బిజీ అయ్యారు. అయితే తాజాగా సదా సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.

ఇలా సినిమాలకు దూరమైనటువంటి సదా ఫలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు సదా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
సదా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఒక రెస్టారెంట్ కూడా రన్ చేస్తున్నారు.

ముంబైలో ఈమె ఎర్త్ లింగ్స్ కేఫే పేరిటరెస్టారెంట్ నడుపుతుంది అయితే ఈ రెస్టారెంట్ చూసుకోవడం కోసం ఈమె తన పనులన్నింటినీ పక్కనపెట్టి ఈ రెస్టారెంట్ ను ఎంతో అందంగా తీర్చిదిద్ది నడుపుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈ ప్లేస్ ఓనర్ తనని కాళీ చేయమని చెప్పారంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

2019 ఏప్రిల్ 23వ తేదీ ఈ రెస్టారెంట్ ప్రారంభించాను అని తెలిపారు. అయితే రెస్టారెంట్ ప్రారంభించడానికి ముందు ఇక్కడ అంతా చాలా చండాలంగా ఉండేది అయితే కరోనా సమయంలో తన రెస్టారెంట్ కు కస్టమర్లు రాకపోయినా అధిక సమయం ఇక్కడే ఉంటూ తన రెస్టారెంట్ ను చాలా అందంగా తీర్చిదిద్దుకున్నానని సదా తెలిపారు.

Actress Sadha: కన్నీళ్లు ఆగలేదు….

కరోనా సమయంలో తన రెస్టారెంట్ నడవకపోయినా సరైన సమయానికి అద్దె చెల్లించినప్పటికీ ఓనర్ మాత్రం ఖాళీ చేయమని తనకు నెలరోజులపాటు గడువు ఇచ్చారని తెలిపారు. ఇది నాకు పెద్ద షాకింగ్ విషయమే అని చెప్పాలి.అయితే ఈ రెస్టారెంట్ వదిలి వెళ్లిపోవడం తన వల్ల కాలేదని కన్నీళ్లు కూడా ఆగడం లేదు అంటూ ఈ సందర్భంగా సదా కన్నీటి పర్యంతరం అయ్యారు.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

100 Years Old Restaurants: కొన్ని రెస్టారెంట్లకు ఒక్కసారి వెళ్లితే మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంటుంది. అలాంటి వాటిలో కొన్ని ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారు. అలా 100 సంవత్సరాల నుంచి అదే రెస్టారెంట్ ను నడుపుతూ.. ఎంతో మంది కస్టమర్లకు సర్వీస్ చేసిన రెస్టారెంట్లు ఇండియాలో బాగానే ఉన్నాయి. ఇన్ని రోజులు అవి ఇలా సర్వీస్ చేసుకుంటూ ఉన్నాయంటే.. ఆ రెస్టారెంట్లలో ఎలాంటి సర్వీసు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

ఇక.. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారత ఉపఖండం రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశం సుగంధ ద్రవ్యాలు.. విభిన్న సంస్కృతికి చెందిన దేశం. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం.. వైవిధ్యం కారణంగా దేశంలో విస్తృత శ్రేణి వంటకాలు ఉన్నాయి. ఇలా ఏదేశస్తులు అయినా ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పటికీ వదలరు. వాటిపై విసుగు అనేది రాదు. ఇక మంచి భోజనం ఎవరి మానసిక స్థితినైనా తేలికపరుస్తుందని ఎంతో మంది విదేశీయులు పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇక 100 ఏళ్లు అంటే.. బ్రిటీష్ కాలంలో నిర్మించినవి అవేంటో చూద్దామా మరి..

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

గ్లెనరీస్, డార్జిలింగ్…
డార్జిలింగ్ అంటే పర్యాటక ప్రదేశానికి పెట్టింది పేరు. అక్కడికి వచ్చిన పర్యాటకులకు గ్లెనరీస్ అనే రెస్టారెంట్.. ఎంతో అద్భుత అనుభవాన్ని కల్పిస్తుంది.గ్లెనరీ దాదాపు 130 సంవత్సరాల క్రితం నిర్మించారట. అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. దీనిలో రుచికరమైన అల్పాహారం నుంచి రుచికరమైన డెజర్ట్‌లు.. ప్రధాన ఆహార పదర్ధాలు ఉటాయి. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్‌ని సందర్శించినట్లయితే.. అక్కడ ఏదో పదర్థాన్ని రుచి చూడండి.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

లియోపోల్డ్ కేఫ్, ముంబై
ఇది ముంబైలో 150ఏళ్ల కాలం నాటిది. అప్పుడు ఇది ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉంది. 2008 ముంబై దాడుల సమయంలో ఈ కేఫ్ ప్రభావితమైంది. ఇప్పటికీ ఆ బుల్లెట్ గుర్తులు ఆ రెస్టారెంట్ వద్ద గుర్తులు ఉంటాయి. ఈ ప్రదేశం ఒక పర్యాటక ప్రదేశంగా గుర్తించబడుతోంది.

100 Years Old Restaurants: ఆహారం తింటే ఈ రెస్టారెంట్లలోనే తినాలి అంటారు..ఇలా 100 ఏళ్ల కాలం నాటి రెస్టారెంట్లు ఏవో చూద్దామా..!

ఇండియన్ కాఫీ హౌస్, కోల్‌కతా..
ఇండియన్ కాఫీ హౌస్ లేదా ICH అని దీనిని పిలుస్తారు. ఇది ప్రతి భారతీయుడికి తెలిసిన ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్. మొదటి ఇండియన్ కాఫీ హౌస్ 1876లో కోల్‌కతాలో ప్రారంభించబడింది. అయితే దీనిని మొదట ఆల్బర్ట్ హాల్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 సంవత్సరంలో పేరు ఇండియన్ కాఫీ హౌస్‌గా మార్చబడింది. ఈ ప్రదేశం వద్ద లభించే కాఫీ స్వర్గాన్ని తలపిస్తుందని అంటుంటారు.


కరీమ్ న్యూ ఢిల్లీ..

ఇది జామా మసీదు నుంచి కొద్ది దూరం నడిస్తే అక్కడ ఉంటుంది. దీనిని 1913లో నిర్మించారు. హాజీ కరీముద్దీన్ చేత స్థాపించబడింది. అతను ఆహారం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు. దీంతో ఢిల్లీలోని స్థానికులకు నవాబీ రాజ వంటకాలను తీసుకురావాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే విజయవంతంగా రూపొందించాడు. తర్వాత ఇది సెలబ్రిటీ చెఫ్ గా మారిపోయింది. ఇక్కడ అందించే ఆహారం.. 5 స్టార్ హోటల్ చెఫ్ అయినా అధిగమించలేరు.